RTC Safety: రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ప్రత్యేక పథకాలు. బుుణాలు మరియు వివిధ కార్యక్రమాలతో మహిళలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగుతుంది. వారి ఆర్ధిక విషయంలో తోడ్పాటును అందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అయితే దీనిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంను ప్రవేశ పెట్టి అమలు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కొన్ని మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ప్రభుత్వం ఎర్పాటు చేయనుంది. ఆర్టీసీ బస్సులో భరోసా పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. దొంగతనాలు, అనుమానస్పద వ్యక్తుల కదలికలు గుర్తించేందుకు సీసీ కెమెరాలను తీసుకోచ్చింది. దీని పర్యవేక్షణను ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలను పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయడంతో మహిళలకు మరింత భద్రత చేకూరే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు.
Also Read: ఖమ్మం గడ్డపై భట్టి మాస్ వార్నింగ్.. కాంగ్రెస్ శ్రేణులను తాకితే బీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టం
అయితే తొలుత ఫైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 175 బస్సులో సీసీ కెమెరాలను ఆర్టీసీ సంస్థ ఎర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో పైలట్ ప్రాజెక్టున కింద ప్రారంభించారు. దీనిని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ సంస్ధ ఉన్నత అధికారులు తెలిపారు. ఈ పర్యవేక్షణతో మహిళలకు మరింత భద్రతను ప్రభుత్వం కల్పించనుంది.
Also read: కాళేశ్వరం మేడిగడ్డ ఆఫీసులో అగ్నిప్రమాదం.. కీలక రికార్డులు దగ్ధం