Vigilance Committees: స్వేచ్చ బ్యూరో: ఉపాధి హామీ పనులలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్వశక్తి మహిళ, ఉపాధి ఫీల్డ్ ఆఫీసర్, యువజన సంఘం నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి. కమిటీ సభ్యులు వారంలో ఒకరోజు ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాలి. కూలీల హాజరు, జరుగుతున్న ప్రాధాన్యత పనుల పురోగతి, కూలీల వేతనాల చెల్లింపు వివరాలను పరిశీలించాలి. జరుగుతున్న పనులలో ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లయితే సంబంధిత ఉన్నతాధికారులకు కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయాలి. చాలా మటుకు గ్రామాలలో విజిలెన్స్ కమిటీల ఎంపిక కాలేదు. దీంతో గ్రామాలలో గ్రామ రాజకీయ నాయకుల జోక్యం ఉపాధి పనులలో పెరుగుతోంది.
ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఉపాది హామీ పథకంలో భాగంగా నిర్దేశించిన పనులకు గ్రామాలలో ఉపాధి కల్పన సంబంధిత అధికారులు చేపడతారు. పనులు ప్రాధాన్యత క్రమంలో కొనసాగిస్తుంటారు. అందులో భాగంగా ఉదయం వేళలో పని ప్రదేశం దగ్గర కూలీల ముఖ హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు గంటల పని అనంతరం మరోసారి యాప్ లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆరోజు పని దినం కూలీలకు విజయవంతంగా నమోదవుతుంది. ఇక్కడే కొందరు గ్రామ స్థానిక సర్పంచ్ అధికారి పార్టీ నాయకులు, తమకు సంబంధించిన కుటుంబ సభ్యులకు యాప్ లో హాజరు నమోదు చేసుకున్న అనంతరం పనిచేయకుండా పని ముగింపు దశలో వచ్చి మరోసారి హాజరు పొంది ఉపాధి డబ్బు పొందుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్లు సైతం వారికి వంత పాడుతూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కూలీలు సైతం ఖచ్చితమైన నిర్దేశించిన పనులు చేయకుండా తూతూ మంత్రంగా పనులు చేస్తూ సమయం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. వేసవిలో వేసే పనులు లేకపోవడంతో గ్రామంలోని అధిక శాతం ప్రజలు కుటుంబంలో జాబ్ కార్డు కలిగిన వారు ఉపాధి కూలీ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.
Also read: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. కాంగ్రెస్, బీఆర్ఎస్తో కొందరు లీడర్ల రహస్య దోస్తీ!
మహబూబ్ నగర్ 2.23
నారాయణపేట 1.87
నాగర్ కర్నూల్ 3.76
వనపర్తి 2.79
గద్వాల 3.30
Also read: నేటి నుండి జూన్ 30 వరకు మెదక్ జిల్లాలో సెక్షన్ 30, 30(ఎ) అమలు