E-Paper
Advertisement

MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!

MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!
Advertisement

MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజే ఈ సుదీర్ఘ విచారణకు తెరదించుతూ స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు.

 కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని, వారు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎటువంటి సాంకేతిక ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.వారు పార్టీ ఫిరాయించినట్లు నిరూపితం కాలేదు కాబట్టి, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని తీర్పునిచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను పూర్తి చేశారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన స్పీకర్, ఇప్పుడు తాజాగా పోచారం, కాలె యాదయ్యలపై కూడా అదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×