E-Paper
Advertisement

MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!

MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!
Advertisement

MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజే ఈ సుదీర్ఘ విచారణకు తెరదించుతూ స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు.

 కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని, వారు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎటువంటి సాంకేతిక ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.వారు పార్టీ ఫిరాయించినట్లు నిరూపితం కాలేదు కాబట్టి, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని తీర్పునిచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను పూర్తి చేశారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన స్పీకర్, ఇప్పుడు తాజాగా పోచారం, కాలె యాదయ్యలపై కూడా అదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×