E-Paper
Advertisement

MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!

MLA Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!

MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజే ఈ సుదీర్ఘ విచారణకు తెరదించుతూ స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు.

 కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని, వారు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎటువంటి సాంకేతిక ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.వారు పార్టీ ఫిరాయించినట్లు నిరూపితం కాలేదు కాబట్టి, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని తీర్పునిచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను పూర్తి చేశారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన స్పీకర్, ఇప్పుడు తాజాగా పోచారం, కాలె యాదయ్యలపై కూడా అదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×