E-Paper
Advertisement

CM Revanth Reddy: సంక్షోభం కాదు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సంక్షోభం కాదు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ తల్లి సాక్షిగా రాష్ట్రాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపుకు సాగిస్తూ.. ప్రజా పాలన అందించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యావత్ తెలంగాణ మొత్తం పండగ చేసుకునే పర్వదినం డిసెంబర్ 9గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి మొదటి ఏడాదిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుందని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.

ఉమ్మడి రాష్ట్రం సమయంలో తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశారని, నేడు మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. గత పాలకులు కుటుంబం గురించి ఆలోచించారే కానీ యావత్ తెలంగాణ గర్వించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనకు నోచుకోలేదంటూ బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను తెలంగాణ తల్లిని చూసిన సమయంలో తన తల్లిని చూసిన భావన కలిగిందని, అదే భావన యావత్ తెలంగాణ కలిగే విధంగా తెలంగాణ తల్లిని రూపొందించినట్లు తెలిపారు.

కవులు కళాకారులకు కానుకలు..
తెలంగాణ అంటేనే కవులు, కళాకారులకు పుట్టినిల్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎందరో కవులు, కళాకారులు, రచయితలు వారి పాటలతో యావత్ తెలంగాణ యువతను చైతన్యపరిచి ఉద్యమం వైపు సాగించడంతోనే తెలంగాణ సాధ్యమైందని సీఎం అన్నారు. తెలంగాణ కోసం గొప్ప కవులు, కళాకారులు కృషి చేశారని, వారిని సన్మానించుకోవడం సత్కరించుకోవడం మన బాధ్యతగా సీఎం పేర్కొన్నారు.

వారిలో గూడా అంజయ్య, గద్దరన్న, బండి యాదగిరి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పాశం యాదగిరి, యాదగిరి రావులకు ఫ్యూచర్స్ సిటీలో 300 గజాల స్థలము, ప్రభుత్వం నుండి కోటి రూపాయల ఆర్థిక సాయం, తామర పత్రాన్ని కూడా అందజేస్తున్నట్లు సీఎం బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రజలను ఆకట్టుకుంది. ఈ డ్రోన్ షో ద్వారా ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేయడం విశేషం. ప్రజా పాలన ముగింపు ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×