Telangana PMFME: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకంలోని సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్ను స్వయం సహాయక సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి “బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ – ఫస్ట్ రన్నర్ అప్” అవార్డు దక్కింది.
న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో నిర్వహించిన ఎంఓఎఫ్పీఐ-పీఎంఎఫ్ఎంఈ నేషనల్ కాన్క్లేవ్–2026లో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా తెలంగాణ తరఫున సెర్ప్ డైరెక్టర్ (ఫామ్) ఎన్. రజిత అవార్డును అందుకున్నారు.ఈ అవార్డు మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా, వారికి మూలధనం అందించి ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానానికి దక్కిన గుర్తింపు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Also Read: పగలంతా పాటలు – రాత్రంతా ఆటలు..ఫోక్ సింగర్ కామెంట్స్ వైరల్
మహిళా సంఘాల సభ్యులు, సెర్ప్ అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు.తెలంగాణలో పీఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ను మహిళా సంఘాల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఈ జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో మహిళలకు చేరవేయడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు అనుసంధానం చేయడంలో సెర్ప్ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందన్నారు. మహిళా సంఘాలు చిన్న వ్యాపారాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, బ్రాండెడ్ ఉత్పత్తుల వరకు విస్తరించి బలమైన వ్యాపార సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
Also Read: కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ!