E-Paper
Advertisement

పగలంతా పాటలు – రాత్రంతా ఆటలు..ఫోక్ సింగర్ కామెంట్స్ వైరల్

పగలంతా పాటలు – రాత్రంతా ఆటలు..ఫోక్ సింగర్ కామెంట్స్ వైరల్
Advertisement

Eshwar Sai and Madhuri Rathod Controversy: ఫోక్ ఇండస్ట్రీలో నీలి నీలి కళ్ళా వాడా అంటూ పలు మంచి పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మమతా బాసాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలపై తన అభిప్రాయాలని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈశ్వర్ సాయి – మాదురి రాథోడ్ పై తనదైన శైలిలో మండిపడింది,మరింతకీ మమత బాసాని ఏమందో ఒక సారి చూసేద్దాం.

ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ లపై రియాక్షన్ 

రాతిరి రాతిరి రాతిరిలో అనే పాటతో ఫేమస్ అయిన ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ లు రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారంపై తనదైన శైలిలో రియాక్ట్ అయింది మమతా బాసాని. వారిద్దరి మధ్య మూడు నెలలుగా రిలేషన్ ఉంటె ఆ విషయం భార్యకి తెలీకుండా ఎలా ఉంటుందని చెప్పుకొచ్చింది. దొరికిన తర్వాత ఈశ్వర్ సాయి మాట మార్చే ప్రయత్నం చేస్తున్నాడని, చెబితే నమ్మేట్టు అయినా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇదొక్కటే కాదని, ఇలాంటివి చాలా జరుగుతున్నాయని, ఇక్కడ దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టుగా ఉందని అసలు విషయం చెప్పుకొచ్చింది.

Advertisement

also read :ఈశ్వర్ సాయి – మాధురి రాథోడ్ ..వీళ్లిద్దరి వల్లే ఇండస్ట్రీ ఇలా!

ఇక్కడ పగలంతా పాటలు, రాత్రంతా ఆటలు

ఇక ఫోక్ సాంగ్స్ షూట్ చేయాలంటే మహా అయితే రెండు రోజులు పడుతుందని,కానీ వీళ్ళు లక్షలు లక్షలు తీసుకుంటూ ఐదారు రోజులు చేస్తున్నారని, అసలు ఒక్క పాటకి అంత అవసరమే లేదని చెప్పుకొచ్చింది.ఇక్కడ ప్రొడ్యూసర్స్ మరియూ కొరియోగ్రాఫర్స్ తమకి నచ్చిన టీమ్ నే కంటిన్యూ చేస్తున్నారని ఇక్కడ జరిగేది వేరు,బయట జరిగేది వేరు అని తెలిపింది.ముఖ్యంగా ఇక్కడ పగలంతా పాటలు, రాత్రంతా ఆటలు అన్న సంస్కృతి నడుస్తుందని వాపోయింది.ఇక్కడ దేనికైనా సిద్దం అనే వారికే అవకాశాలు వస్తున్నాయని , నా లాంటి ముక్కు సూటి మనుషులకి ఇక్కడ చోటు లేదని తన మనసులోని మాటల్ని చెప్పుకొచ్చింది.

శేఖర్ మాస్టర్ కూడా…

Advertisement

ఇక తన చార్ట్ బస్టర్ సాంగ్ ‘నీలి నీలి కళ్లవాడే’ గురించి మాట్లాడుతూ.ఆ పాట ఎంతో పెద్ద హిట్ అయినప్పటికీ, నా పేరు ఎవరికీ తెలీదని, కానీ మాను కోట ప్రసాద్ అనే లిరిక్ రైటర్ తన ప్రతిభని గుర్తించి గుర్తింపు ఇచ్చాడని తెలిపింది.ఇక ఒక టీవీ షోలో దేత్తడి హారిక ఈ పాట చేస్తే శేఖర్ మాస్టర్ కూడా పాట బాగుంది అని మెచ్చుకున్నాడు కానీ ఈ పాట పాడిన తన పేరుని మాత్రం ఎక్కడా పలకలేదని మనసులోని మాటల్ని బయటపెట్టింది.

also read :ఈశ్వర్ సాయి వీడియో మళ్లీ బయటకు.. రాఖీ కట్టించుకో అంటూ…

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ 

ఇక తను పాడిన ఫేమస్ సాంగ్స్ కి డిజే వెర్షన్ వేరేవాళ్ళతో పాడించి తనకి క్రెడిట్ ఇవ్వడం అటుంచి చెప్పనుకూడా చెప్పలేదని వాపోయింది. ఇక ఈ ఫోక్ ఇండస్ట్రీలో కళ్ళ ముందు కనిపించినపుడే నువ్వు తోపు తురుం, నెక్స్ట్ అన్నిపాటలు నువ్వే పాడాలని ఆకాశానికి ఎత్తుతారని కానీ కాస్త పక్కకి వెళ్ళగానే ఎవరూ దేఖరని ఇండస్ట్రీలో ఉన్న లోతుపాతుల్ని చెప్పుకొచ్చింది మమత బాసాని. ఇప్పుడు ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

ఈశ్వర్ సాయి – మాధురి రాథోడ్ ..వీళ్లిద్దరి వల్లే ఇండస్ట్రీ ఇలా!

అనసూయ తుమ్మింది.. మీరు మీరూ కొట్టుకుని చావండి

బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్న జబర్దస్త్ జడ్జెస్.. కంటెస్టెంట్స్ కి పండుగే!

సుడిగాలి సుధీర్ పై మనసు పారేసుకున్న సీరియల్ హీరోయిన్?

పవన్, రీతూ చౌదరి జంటకి అవమానం.. శ్రీముఖిపై నెటిజన్స్ ఫైర్!

Podarillu Today Episode : విక్కీకి చక్రీ ఝలక్.. కన్నాకు సపోర్ట్ గా మహా.. మాధవ్ కు నిజం చెప్పిన శైలు..

Gundeninda GudiGantalu Today episode: కొడుకు కోసం పార్వతి ఎమోషనల్.. అయ్యో శివ.. బాలు దెబ్బకు గుణ షాక్..

Big Stories

Advertisement
×