E-Paper
Advertisement

గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!

గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!
Advertisement

Panchayat Funds: స్వేచ్ఛ బ్యూరో: నిధులు కనబడితే చాలు.. తీర్మానం అక్కర్లేదు, బిల్లుతో పనే లేదు! సర్పంచ్‌లు మారినా, స్పెషల్ ఆఫీసర్లు మారినా పంచాయతీ నిధులను ‘నమిలేసే’ నైజం మాత్రం మారలేదు. గట్టు గ్రామపంచాయతి లో ఏకంగా రూ.22 లక్షల ప్రజాధనం పక్కదారి పట్టిన వ్యవహారంపై డీఎల్పీఓ, ఎంపీఓలు రంగంలోకి దిగడంతో అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి. ఎవరికి వారే యథాశక్తి ‘చేతివాటం’! అధికారుల విచారణలో వెలుగుచూసిన అక్రమాల చిట్టా చూస్తే పంచాయతీ ఖజానాను ఎంత దారుణంగా దోపిడీ చేశారో అర్థమవుతోంది.

పాత సర్పంచ్ పర్వం..

గత సర్పంచ్ హయాంలోనే అక్రమాలకు గండిపడింది. కనీస లెక్కాపత్రం లేకుండా ఏకంగా రూ.7.90 లక్షలు గుటుక్కుమనిపించారు. కార్యదర్శుల కక్కూర్తి పాలకవర్గం లేని స్పెషల్ ఆఫీసర్ పాలనలో ముగ్గురు కార్యదర్శులు చేతులు కలిపి రూ.7 లక్షల నిధులను నిలువునా ఊడ్చేశారు. కొత్త పాలకవర్గం దోపిడీ మేము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే ప్రస్తుత సర్పంచ్ రూ.5 లక్షలు డ్రా చేసి రికార్డులను పాతరేశారు.

Advertisement

Also Read: పౌర సేవలకే కాకుండా.. ఆదాయ మార్గంగా ‘మీ సేవా’.. మెటాతో తెలంగాణ కీలక ఒప్పందం

రికార్డులు మాయం!

ప్రమాణస్వీ కారానికి ‘జలసా’ చివరకు ప్రమాణస్వీకారం పేరుతోనూ ప్రజాధనం నుంచి రూ.90 వేలు దండుకోవడం వీరి తెంపరితనానికి పరాకాష్ట! గ్రామసభలకు మంగళం రికార్డులు మాయం! ఎనిమిది నెలల్లో కనీసం ఒక్కటంటే ఒక్క గ్రామసభతో మమ అనిపించి, నిధుల వినియోగాన్ని ప్రజల నుంచి పూర్తిగా దాచిపెట్టారు. విచారణలో అధికారులు రికార్డులు, తీర్మానాలు చూపాలని నిలదీస్తే బాధ్యుల వద్ద సమాధానం కరువైంది. బాధ్యులపై వేటు తప్పదు!” ప్రజాధనం అస్మదీయుల పాలు కావడంపై సమగ్ర విచారణ జరుగుతోంది. రెండు రోజుల్లో కలెక్టర్‌తో పాటు ఉన్నతా ధికారులకు నివేదిక ఇస్తాం. రికార్డులు దాచినా, నిధులు మళ్లించినా ఎంతటి వారిపై నైనా చర్యలు తప్పవని డి ఎల్ పి ఓ పేర్కొన్నారు.

Advertisement

Also Read: మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

Tags

Related News

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్

కూతురి వ్యాఖ్యలతో మాకేం సంబంధం.. కాంగ్రెస్‌లోనే ఉంటాం.. కొండా మురళి క్లారిటీ!

మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×