America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చనిపోతున్న తెలుగు విద్యార్థుల ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కొందరు, గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరికొందరు, అనారోగ్యం కారణంగా ఇంకొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతి చెందాడు.
అమెరికాలో తెలుగు యువకుడి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల బొల్లెందుల అరుణ్ సాయిరెడ్డి ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. వెంకట్ రెడ్డి-సరళా రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు.చదువు పూర్తి కావడంతో ఉద్యోగం విషయంలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ప్రస్తుతం ఫ్లోరిడాలోని టెంపా సిటీలో ఉంటున్నాడు. అక్కడ స్టెమ్ ఓపీటీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఏం జరిగిందో తెలీదుగానీ జూన్ 19న అరుణ్ సాయిరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే స్నేహితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అరుణ్ సాయిరెడ్డి, అనారోగ్యం ఆ తర్వాత ఆసుపత్రిలో మృతి
పరిస్థితి విషమించడంతో అరుణ్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. అరుణ్ సాయిరెడ్డి మృతి చెందిన విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాకయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడాన్ని తట్టుకోలేకపోలేదు. చిన్న వయసులో కొడుకు దూరమయ్యాడనే వార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అరుణ్ సాయిరెడ్డి పార్థివ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రవాస తెలుగు సంఘాలు, స్నేహితులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అరుణ్ సాయిరెడ్డి మృతికి మరిన్ని కారణాలు తెలియాల్సివుంది. తమ కొడుకును ఎలాగైనా రాష్ట్రానికి రప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ALSO READ: పెరుగు ప్యాకెట్లో చనిపోయిన ఎలుక.. షాకైన కొనుగోలుదారుడు, రంగంలోకి అధికారులు