E-Paper
Advertisement

USA: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హైదరాబాద్ చేరుకున్న నిఖిత మృతదేహం

USA: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హైదరాబాద్ చేరుకున్న నిఖిత మృతదేహం

USA: అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ వాసి నిఖిత మృతదేహం శుక్రవారం ఉదయం నగరానికి చేరుకుంది. తార్నాకలోని ఆమె నివాసానికి పార్థివదేహం రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమార్తె విగతజీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనుకున్న యువతి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం స్థానికులను సైతం కలచివేస్తోంది.

డబ్బుల విషయంలో వివాదం.. చివరికి హత్య..
అయితే ఈ ఘాతుకానికి ఆర్థిక గొడవలే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో నిఖితతో కలిసి రూమ్‌మేట్‌గా ఉన్న అర్జున్ శర్మ అనే యువకుడు ఆమె వద్ద సుమారు 4500 డాలర్లు అప్పుగా తీసుకున్నాడు. అందులో కొంత మేర తిరిగి చెల్లించినప్పటికీ, మిగిలిన 1000 డాలర్ల విషయంలో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ బకాయి మొత్తాన్ని ఇస్తానని చెప్పి డిసెంబర్ 31వ తేదీ రాత్రి అర్జున్ శర్మ నిఖితను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు.

హత్య చేసి భారత్‌కు పరారీ
మేరీల్యాండ్‌లోని తన నివాసానికి వచ్చిన నిఖితతో అర్జున్ శర్మ మళ్లీ నగదు విషయంలో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన నిందితుడు ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా నటించి, నిఖిత కనిపించడం లేదని స్వయంగా అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి హుటాహుటిన విమానం ఎక్కి భారతదేశానికి పారిపోయి వచ్చాడు.

గుట్టురట్టు చేసిన అమెరికా పోలీసులు
నిఖిత అదృశ్యంపై దర్యాప్తు చేపట్టిన అమెరికా పోలీసులు అర్జున్ శర్మ ఫ్లాట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అక్కడ ఆమె మృతదేహం లభ్యమైంది. గదిలోని ఆధారాలను సేకరించిన అధికారులు, అర్జున్ ప్రవర్తనపై అనుమానంతో విచారించగా అతడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పష్టమైంది. అప్పటికే అతడు ఇండియాకు పారిపోవడంతో అమెరికా అధికారులు అంతర్జాతీయ పోలీసు యంత్రాంగాన్ని ఆశ్రయించి ‘రెడ్ కార్నర్’ నోటీసులు జారీ చేశారు.

Also Read: గ్రేటర్ హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 36 గంటలపాటు వాటర్ సరఫరా బంద్

నిందితుడి అరెస్ట్
అమెరికా పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన భారత పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో అర్జున్ శర్మ తమిళనాడులో తలదాచుకున్నట్లు గుర్తించి, ఇంటర్‌పోల్ సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు. మరోవైపు, నిఖిత మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడంలో అమెరికాలోని తెలుగు సంఘాలు, ప్రభుత్వం కీలక పాత్ర పోషించాయి.

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×