E-Paper
Advertisement

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

Brs Activists vs Police: భద్రాద్రిలో హై టెన్షన్.. పోలీసులు వర్సస్ బీఆర్ఎస్ కార్యకర్తలు తోపులాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ZPHS స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రం సమీపంలో గుమికూడి, ఓటర్లకు తమ పార్టీ గుర్తులను చూపిస్తూ ప్రచారం చేసినట్లు సమాచారం. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని గుర్తించిన పోలింగ్ అధికారి అడ్డుకోవాలని ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీస్ బలగాలు వెంటనే దిగి వచ్చి కార్యకర్తలను వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంతసేపు అక్కడ గందరగోళం నెలకొనగా.. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని నియంత్రించారు.

ఈ ఘటనతో పోలింగ్ సెంటర్ వద్ద కొద్ది సమయంలో ఓటింగ్ నిలిచిపోయింది. తర్వాత పరిస్థితిని సమీకరించిన అధికారులు ఓటర్లను భరోసా ఇచ్చి పోలింగ్ మళ్లీ ప్రారంభించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సంబంధిత కార్యకర్తలపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల అధికారు లు నివేదికలు సేకరిస్తున్నారని సమాచారం.

మణుగూరులో జరిగిన ఈ సంఘటన స్థానిక రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపగా, పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసులు అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×