BigTV English

Three Women Died : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళలు మృతి

Three Women Died : ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళలు మృతి

Three Women Died in Road Accident : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్న బొకూర్ గ్రామానికి చెందిన మల్యాల వెంకటేశ్ అనే వ్యక్తి మియాపూర్ గ్రామం చివరిలో తనకు ఉన్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న కంకుల పొట్టు తీసేందుకు తన భార్య సహా.. 8 మంది మహిళా కూలీలను ట్రాక్టర్ లో తీసుకెళ్లారు.


పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ, భేతి లక్ష్మి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. వెంకటేశ్ భార్య అయిన వైష్ణవి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మిగతా కూలీలకు సైతం గాయాలవ్వడంతో వాళ్లందరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×