E-Paper
Advertisement

మంత్రులు గాలికి తిరుగుతున్నారా? ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం గట్టి కౌంటర్

మంత్రులు గాలికి తిరుగుతున్నారా? ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం గట్టి కౌంటర్
Advertisement

తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంత్రుల పర్యటనలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. మంత్రులు ‘గాలికి తిరుగుతున్నారు’ అంటూ ఆయన చేసిన సంబోధన ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలు సభ్యతకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని హెచ్చరించడంతో మహేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆ పదాలను రికార్డుల నుండి స్పీకర్ తొలగించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. మంత్రులు హెలికాప్టర్లలో వెళ్తున్నారని చెప్పాలనుకుంటే ‘గాలి మోటార్లలో’ వెళ్తున్నారని అనాలే తప్ప గాలికి తిరుగుతున్నారని అనడం సరికాదన్నారు. తెలంగాణ యాసలో గాలికి తిరగడం అంటే బాధ్యత లేకుండా అవారాగా తిరగడమని అర్థమని ఆయన గుర్తు చేశారు. మంత్రులు తమ బాధ్యతల్లో భాగంగానే ప్రభుత్వ కార్యక్రమాల కోసం జిల్లాల్లో పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి అగౌరవకరమైన భాష వాడటం తగదని హితవు పలికారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో మహేశ్వర్ రెడ్డి చేసిన విమర్శలను మంత్రి పొన్నం తిప్పికొట్టారు. గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్ర వాటాను సక్రమంగా చెల్లించలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న 3000 కోట్ల రూపాయల రాష్ట్ర వాటాను కేంద్రానికి చెల్లించినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రతి పథకంలోనూ రాష్ట్ర వాటా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ కేంద్ర పథకాల అమలులో అడ్డంకులు లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా వచ్చే వాటా మాత్రమేనని అది ఎవరి భిక్ష కాదని పేర్కొన్నారు.

Advertisement

తెలంగాణ అభివృద్ధికి కేవలం పథకాల వాటా నిధులు సరిపోవని ప్రత్యేక నిధులు అవసరమని మంత్రి డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా ఏమి ఇచ్చిందో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని విమర్శించారు. కేవలం విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

సభలో గందరగోళం మధ్యే అభివృద్ధి అంశాలపై చర్చ కొనసాగింది. చివరకు మహేశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలు ఎవరినీ నొప్పించడానికి ఉద్దేశించినవి కావని వివరణ ఇస్తూ వాటిని ఉపసంహరించుకోవడంతో సభ సద్దుమణిగింది. స్పీకర్ ఆదేశాల మేరకు సభా మర్యాదలకు భంగం కలిగించే పదజాలాన్ని అధికారిక రికార్డుల నుండి తొలగించారు.

ALSO READ: రోజురోజుకు ముదురుతున్న డంపింగ్ యార్డ్ వివాదం.. పట్టించుకోని ప్రభుత్వం

Related News

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసి రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

Bike Theft Gang: షామీర్‌పేటలో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. ఎక్కడ దాచారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

నింగికి నిచ్చెన వేసిన తెలుగు శాస్త్రవేత్తలు.. ‘స్కైరూట్’ సృష్టికర్తల సక్సెస్ స్టోరీ!

Govt Hospital Scans: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత స్కానింగ్ మాయం.. పైసలిస్తేనే టెస్టులు!

ఆమె లేని లోకంలో ఉండలేనంటూ.. ప్రియురాలు చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రియుడు సైతం..

Big Stories

Advertisement
×