E-Paper
Advertisement

Turmeric Board Nizamabad: నిజామాబాద్‌లో పసుపు బోర్డు.. రైతులకు కలిగే లాభమేంటి?

Turmeric Board Nizamabad: నిజామాబాద్‌లో పసుపు బోర్డు.. రైతులకు కలిగే లాభమేంటి?
Advertisement

Turmeric Board Nizamabad: ఏళ్ల తరబడి కలగా మిగిలిన పసుపు బోర్డు ఎట్టకేలకు నిజమైంది. నిజామాబాద్‌లో అధికారికంగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైంది. దీనితో తెలంగాణ రైతుల ఆశలు తిరిగి జాలువారాయి. పసుపు పంట సాగు చేసే రైతులకు ఇది మైలురాయిగా నిలవనుంది. ఇక రైతు నైతికంగా బలపడటమే కాదు, ఆర్థికంగా కూడా లాభపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

తెలంగాణలో పసుపు పంట సాగు చేసే రైతులు ఏళ్ల తరబడి ఒకే డిమాండ్ చెబుతూనే వచ్చారు. పసుపు బోర్డు కావాలి.. నేరుగా రైతుల అవసరాలను తీర్చేలా ఓ సంస్థ ఉండాలి. నిజామాబాద్‌ ప్రాంతంలో పసుపు పంట విస్తృతంగా సాగవుతుంది. పసుపు ధరలు మారిపోతుండటంతో రైతులు ఎప్పటికప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏ ధర వస్తుందో తెలీదు, ఎగుమతుల పరిస్థితి స్పష్టంగా ఉండదు. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు ఉండాలని, మార్కెట్‌కు కనెక్టివిటీ ఉండాలని, ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించాలని రైతులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు.

Advertisement

ఇప్పుడు ఆ కల నిజమైంది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది దేశంలో మొదటిసారి పసుపు పంటకే ప్రత్యేకంగా ఏర్పాటైన బోర్డు కావడం గమనార్హం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా బోర్డును ప్రారంభించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా కార్యాలయాన్ని ప్రారంభించారు.

పసుపు ధరలకు మద్దతు
ఇప్పటివరకు రైతులు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి వద్ద సహాయం తీసుకోవాలో తెలియక తికమక పడేవారు. ఇకపై పసుపు బోర్డు ద్వారా మార్కెట్ సమాచారం, ఎగుమతి అవకాశాలు, మద్దతు ధరలు వంటి అంశాలపై తేలికగా సమాచారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోర్డు మార్కెట్‌లో పసుపు ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది.

Advertisement

సాగు విధానాల్లో మార్పు, శిక్షణ
బోర్డు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వనుంది. పసుపు నాణ్యత పెరిగేలా, దిగుబడులు మెరుగుపడేలా నూతన విత్తనాలు, పద్ధతులు ప్రవేశపెడతారు. రైతులు శాస్త్రీయంగా పంట సాగు చేయడం ద్వారా మంచి ధరలకు అమ్మే అవకాశముంటుంది. ఇలా పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతుకు శిక్షణతో పాటు సాంకేతిక సహాయంతో సాగు మెరుగవుతుంది.

ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల పెంపు
పసుపును కేవలం పచ్చడి లేదా వంటలకే కాదు, ఔషధంగా, కాస్మెటిక్స్‌లో, హెల్త్ ప్రాడక్ట్స్‌లోనూ విస్తృతంగా వాడుతున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన బోర్డు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇలా చేస్తే రైతులు తక్కువ ధరకు అమ్మకాలు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రాసెసింగ్ ద్వారా అధిక విలువలతో అమ్మే అవకాశముంటుంది. అంతేకాదు, విదేశాలకు ఎగుమతులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మద్దతు ఇవ్వనుంది.

Also Read: Telangana Vehicle Rules 2025: మీవద్ద వెహికల్ ఏదైనా ఉందా? వెంటనే ఇలా చేయండి.. లేకుంటే ఫైన్ తప్పదు!

రైతు సమస్యలపై నేరుగా స్పందన
పసుపు సాగుతో సంబంధం ఉన్న సమస్యలు.. నీటి కేటాయింపు, ఎరువుల కొరత, కరెంటు సమస్యలు, మార్కెట్ లింకులు.. ఇవన్నింటినీ పసుపు బోర్డు నేరుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను వహిస్తుంది. గతంలో ఇవన్నీ రైతులకు భారంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం సమస్యల పరిష్కారానికి ఓ అధికారిక వేదిక వచ్చింది.

ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి
పసుపు బోర్డు వల్ల ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ గోదాములు, ప్యాకేజింగ్ కేంద్రాలు ఏర్పాటు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. యువతకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఉపాధి దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇలా పసుపు ద్వారా ప్రత్యక్షంగా రైతులకు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది.

పసుపు రైతుల గౌరవం పెరుగుతుంది
ఇప్పటి వరకు ఇతర పంటలపై బోర్డులు ఉండేవి. కానీ పసుపుకూ బోర్డు ఏర్పాటు కావడంతో రైతుల్లో గర్వం, నమ్మకం పెరిగింది. మనకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే భావన రైతుల్లో బలంగా కనిపిస్తోంది. ఇది మానసికంగా రైతులను బలోపేతం చేస్తుంది. ఇక పసుపు రైతును ఎవ్వరూ తక్కువ చూపకూడదు.

నిజామాబాద్ పసుపు బోర్డు ద్వారా పసుపు రైతుల జీవితాల్లో పెద్ద మార్పు రానుంది. మార్కెట్ మద్దతు, శిక్షణ, ఎగుమతులు, ప్రాసెసింగ్, సమస్యల పరిష్కారం వంటి అన్ని అంశాల్లో బోర్డు కీలక పాత్ర పోషించనుంది. ఇది కేవలం ఒక కార్యాలయం కాదు.. ఇది పసుపు రైతుకు న్యాయం చేసే ఒక కేంద్రం. ఇప్పుడు తెలంగాణ రైతుకు ఆశాజ్యోతి కనిపిస్తోంది. ఈ బోర్డు పనితీరుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇకపోతే, ఇది రైతు జీవితాన్ని మార్చే తెలంగాణ పసుపు పథకరేఖగా నిలవాలన్నది అందరి ఆశ.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×