E-Paper
Advertisement

Underage Driving Accidents: నగరంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య.. యధేచ్ఛగా బైకులు నడుపుతున్న పిల్లలు

Underage Driving Accidents: నగరంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య.. యధేచ్ఛగా బైకులు నడుపుతున్న పిల్లలు
Advertisement

Underage Driving Accidents| హైదరాబాద్‌లో ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గత మూడు నెలల్లో ట్రాఫిక్ పోలీసులు 5,000 కంటే ఎక్కువ కేసులు రిజిస్టర్ చేశారు. ఇవన్నీ లైసెన్స్ లేకుండానే బైక్‌లు లేదా కార్లు నడిపిన మైనర్లపైనే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.

ఇటీవలే ఇలాంటి రెండు విషాదకర ఘటనలు జరిగాయి. ఇందులో కుటుంబ సభ్యులే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

బైక్ నడిపిన పిల్లలు.. చనిపోయిన కుటుంబ సభ్యులు
ఒక ఘటనలో, పదో తరగతి విద్యార్థి తన చెల్లిని ముందు కూర్చోబెట్టి బైక్ నడుపుతున్నాడు. అతడు వాహనం మీద నియంత్రణ కోల్పోవడంతో ఇద్దరూ కిందపడ్డారు. చెల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఆ బాలుడిపై లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక మరణానికి కారణమైనందుకు కేసు నమోదు చేశారు.

ఇంకో సంఘటనలో, 9వ తరగతి విద్యార్థి తన తండ్రిని వెనక కూర్చోబెట్టి బైక్ నడుపుతున్నాడు. ఒక్కసారిగా బ్రేక్స్ వేసినప్పుడు తండ్రి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కూడా కేసు నమోదైంది. తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ప్రమాదంలో పిల్లల భవిష్యత్తు
పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్‌లు లేదా స్కూటీలు ఇచ్చేస్తున్నారు. కొందరు పిల్లలు డ్రైవింగ్ నేర్చుకున్నారనే అహంకారంతో ఇవ్వడం జరుగుతుంది. మరికొందరు ఆటో లేదా బస్సు ఖర్చులు ఎక్కువవుతున్నాయని కారణంగా చూపుతున్నారు. ఇంకొందరు పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా బైక్ తాళాలు తీసుకుని రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేయడం.. వేగంగా హైవేలపై రేసులు చేయడం లాంటివి చేస్తున్నారు.

పాఠశాల రాకపోకలకు బైక్ వినియోగిస్తున్న విద్యార్థులు.. ట్రాఫిక్ పోలీసుల అధ్యయనం
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా అధ్యయనం ప్రకారం.. అబిడ్స్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్.ఆర్. నగర్, బేగంపేట, హబ్సిగూడ, షేక్‌పేట్, టోలిచౌకి వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల్లో 1-2% మంది బైక్ మీద పాఠశాలకు వస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులు
ఈ ప్రమాదాలను అరికట్టేందుకు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఏప్రిల్ 5 నుండి జూన్ వరకు మొత్తం 5,040 కేసులు నమోదు చేసి.. రూ. 41 లక్షల 33 వేల 850 జరిమానా వసూలు చేశారు. అంతేకాదు, 863 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు.

వాహన యజమానులు లేదా తల్లిదండ్రులు పిల్లల చేత వాహనం నడిపిస్తే.. 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25,000 వరకు జరిమానా, వాహనం రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు చేయబడుతుంది. మైనర్లు పట్టుబడితే వారికి 25 ఏళ్ల వరకూ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు.

పిల్లలకు వాహన నియంత్రణ తెలియదు
ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డేవిస్ మాట్లాడుతూ.. చిన్నపిల్లలు రోడ్డు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు వాహనం నియంత్రించేందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేరని చెప్పారు. అర్థాంతరంగా అడ్డంకులు వస్తే, బ్రేకులు వేయాల్సి వస్తే, సడెన్‌గా దారిమార్చాల్సిన అవసరం వస్తే పిల్లలు భయంతో తప్పులు చేస్తారు. దీనివల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

పిల్లలు, టీనేజర్లు బైక్ నడపకుండా తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం అందరూ బాధ్యత వహించాలి. పిల్లల ప్రాణాలను కాపాడాలంటే ఇది అత్యవసరం.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×