E-Paper
Advertisement

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Irrigation Projects: స్వేచ్ఛ బ్యూరో: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జకోరా, చందూర్,చింతకుంట ఎత్తిపోతల పధకాలు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. త్వరితగతిన ఈ ఎత్తిపోతల పధకాలు పూర్తి కావడం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు.రూ.106.04 కోట్లతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకాలతో నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలోని 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని తెలిపారు.

ఆధునిక పరిజ్ఞానంతో.. 

వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుండి జకోరా ,చందూర్,చింతకుంట ఎత్తిపోతల పధకాల ద్వారా నీటి పంపిణీ ఉంటుందని వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్ హౌస్ లకు 2.93 మేఘావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని,తద్వారా నీటి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Also Read: గంజాయి అడ్డాలో గ్యాస్ సిలిండర్లు కలకలం

త్వరలోనే ఈ పధకాలు..

ఈ ఎత్తిపోతల పథకాలతో ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్టీరికరించడంతో పాటు అదనంగా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడం చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పధకాలను ట్రయిల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పథకాలు ప్రారంభోత్సవం అయితే ధాన్యం దిగుబడి పెరగడంతో పాటు, పంటల భద్రత ఇనుమడింప చేస్తుందన్నారు. రైతుల అభ్యున్నతికి సాగునీటి విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందని త్వరలోనే ఈ పధకాలు ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

Advertisement

Also read: అవమానాలకు అడ్డ బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×