Congress Leader Missing: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఎన్నికల వేళ కలకలం రేగింది. వేములవాడ మున్సిపాలిటీ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు తోటరాజు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ సమీకరణాలు, టికెట్ కేటాయింపులో జరిగిన పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ 4వ వార్డు నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఆశావహులుగా ఉండి, నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. పార్టీ అధిష్టానం ఇద్దరినీ పిలిపించి చర్చలు జరిపింది. చివరి నిమిషంలో తోటరాజును పక్కన పెట్టి, టికెట్ను మరొక అభ్యర్థికి కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న తనకు అవకాశం రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు.
సోమవారం ఉదయం తోటరాజు ఇంట్లో టిఫిన్ తిని బయటకు వెళ్లారు. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా.. మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పలుచోట్ల వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తోటరాజు అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రాజకీయ కారణాలతోనే ఈ అదృశ్యం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి ఇలా అదృశ్యం కావడం పట్టణంలో రాజకీయ వేడిని పెంచింది.
Also Read: విచారణ చేయడంలో తప్పేం లేదు.. కేసీఆర్ పై కవిత సంచలనం
వేములవాడ మున్సిపల్ 4వ వార్డు అభ్యర్థి తోటరాజు అదృశ్యం
ఉదయం టిఫిన్ చేసి బయటకు వెళ్లిన తోటరాజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు
ఇద్దరిని పిలిపించి టికెట్ మరొకరికి కేటాయించడంతో మనస్తాపం… pic.twitter.com/W9Bw6TpWK9
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2026