E-Paper
Advertisement

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం.. చలిలో వణికిన ప్రయాణికులు

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం.. చలిలో వణికిన ప్రయాణికులు
Advertisement

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులకు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇటీవల ఇదే ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువకముందే, తాజాగా మరో బస్సు నడిరోడ్డుపై ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది.

హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు (నెంబర్ PY 04 A2542) పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే టైర్ల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ ఓవర్ హీట్ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. పొగలు రావడంతో భయాందోళనకు గురైన 26 మంది ప్రయాణికులు వెంటనే బస్సు దిగేశారు.

Advertisement

అయితే, తీవ్రమైన చలిలో ఫ్లైఓవర్ పైనే దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్నా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదంతో వార్తల్లో నిలుస్తున్నా, యాజమాన్యం వాహనాల ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×