E-Paper
Advertisement

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం.. చలిలో వణికిన ప్రయాణికులు

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు మరో ప్రమాదం.. చలిలో వణికిన ప్రయాణికులు
Advertisement

Hyderabad: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులకు ప్రమాదాలు వరుసగా వెంటాడుతున్నాయి. ఇటీవల ఇదే ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువకముందే, తాజాగా మరో బస్సు నడిరోడ్డుపై ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది.

హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు (నెంబర్ PY 04 A2542) పెద్ద అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే టైర్ల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. బస్సు ఇంజిన్ ఓవర్ హీట్ కావడంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. పొగలు రావడంతో భయాందోళనకు గురైన 26 మంది ప్రయాణికులు వెంటనే బస్సు దిగేశారు.

Advertisement

అయితే, తీవ్రమైన చలిలో ఫ్లైఓవర్ పైనే దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రయాణికులు ఇంత ఇబ్బంది పడుతున్నా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రమాదంతో వార్తల్లో నిలుస్తున్నా, యాజమాన్యం వాహనాల ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. గత ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×