E-Paper
Advertisement

TS Congress : తెలంగాణ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ గా విజయశాంతి

TS Congress : తెలంగాణ కాంగ్రెస్ ప్లానింగ్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ గా విజయశాంతి
Vijayashanti joins Congress

Vijayashanti joins Congress(Telangana Congress News):

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీపై పార్టీ హైకమాండ్ ప్రకటన చేసింది. కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్లుగా 15 మందికి అవకాశం కల్పించింది. మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేదంర్, సమరసింహారెడ్డి, పుష్పలీల, అనిల్, రాములు నాయక్ , పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలిబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్ లను కన్వీనర్లుగా నియమిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.

కాగా.. బీజేపీలో విజయశాంతికి ఏ స్థానమైతే దక్కలేదో.. ఇక్కడ కాంగ్రెస్ దానికే ఇంపార్టెన్స్ ఇచ్చింది. బీజేపీలో తనకు సముచితమైన స్థానం లేదని రాములమ్మ తెలిపిన విషయం తెలిసిందే. శుక్రవారమే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతిని.. వెంటనే పార్టీ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ గా నియమించింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలో లీడర్లు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్ కండువాలను కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ఆరు ప్రధాన అంశాలతో పాటు.. శుక్రవారం విడుదల చేసిన పూర్తిస్థాయి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తోంది.

.

.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×