BigTV English
Advertisement

Telugu Parties : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. తెలుగు పార్టీల వ్యూహమేంటి..?

Telugu Parties : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. తెలుగు పార్టీల వ్యూహమేంటి..?
Telugu states political parties news

Telugu states political parties news(Latest political news in India) : ఓవైపు ఎన్డీయే… మరోవైపు ఇండియా . మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల సంగతేంటి? ఇప్పుడీ ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేపై ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కూటమిలో ఉన్న 26 పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాని వైసీపీ,టీడీపీ, బీఆర్‌ఎస్‌ ఎవరికీ మద్దతు ఇవ్వలేదు.


విపక్ష కూటమితోపాటు.. బీఆర్‌ఎస్‌ కూడా వేరుగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. మణిపూర్ లో అల్లర్లపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. అయితే బీఆర్‌ఎస్‌ కు 9 మంది ఎంపీలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. వీరి తీర్మానానికి హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసద్దుద్దీన్‌ ఓవైసీ కూడా మద్దతు ఇచ్చారు.

ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎవరితో పొత్తులో లేమని స్పష్టం చేసింది బీఆర్‌ఎస్‌. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది . ఇప్పటికే బీజేపీకి బీ టీమ్ గా మారారని విమర్శలు వచ్చాయి. దీంతో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా.. వేరుగా అవిశ్వాస తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్‌.


ఏపీలో ఉన్న వైసీపీ,టీడీపీ కూడా ఎవరీకి మద్దతు ప్రకటించలేదు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం విషయంలో తటస్థంగా ఉంది వైసీపీ.కాని పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చేలా కామెంట్ చేసింది వైసీపీ. సభను స్తంభింపజేయడం సరికాదంటూ ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

ఇక టీడీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరు కూడా ఏ కూటమికి మద్దతు ఇవ్వలేదు. ఏపీలో ఇప్పటికే ఎన్డీయేలో టీడీపీలో చేరతుందని ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన,టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా.. బీజేపీకి ఎలాంటి మద్దతు ప్రకటించలేదు టీడీపీ.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×