E-Paper
Advertisement

Wildness Resort: అక్రమాలను ప్రశ్నిస్తే .. కుక్కను ఉసిగొలిపి.. ది వైల్డర్‌నెస్‌ రిసార్ట్‌‌లో.. అసలు ఏం జరుగుతోందంటే

Wildness Resort: అక్రమాలను ప్రశ్నిస్తే .. కుక్కను ఉసిగొలిపి.. ది వైల్డర్‌నెస్‌ రిసార్ట్‌‌లో.. అసలు ఏం జరుగుతోందంటే
Advertisement

Wildness Resort: వికారాబాద్ జిల్లా గోదాంగూడ గ్రామంలో ఏర్పాటైన.. ది వైల్డర్‌నెస్ రిసార్ట్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా ఈ రిసార్ట్ యాజమాన్యం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రైతులను మోసం చేసి అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం, చెరువులో గదులు నిర్మించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

రైతులను మభ్యపెట్టి భూములు కొనేసిన యాజమాన్యం
అందిన సమాచారం ప్రకారం.. రిసార్ట్ యాజమాన్యం స్థానిక రైతులను “ఆర్గానిక్ ఫార్మింగ్” పేరుతో మభ్యపెట్టి.. అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసింది. మీ భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తాం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాం అంటూ మాటలతో మాయ చేసి.. దాదాపు 18 ఎకరాల భూమిని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల్లో కొన్ని ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములే కావడం గమనార్హం.

Advertisement

సర్వే నంబర్ 92లో 5 ఎకరాల అక్రమ ఆక్రమణ
సర్వే నంబర్ 92 ప్రాంతంలోని 5 ఎకరాల భూమిని.. రిసార్ట్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ పాలసీకి విరుద్ధమని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చెరువులో గదుల నిర్మాణం
రిసార్ట్ నిర్మాణాల్లో వాస్తవానికి అన్నిటికంటే వివాదాస్పదం.. చెరువులో నిర్మించిన గదుల వ్యవహారం. గ్రామానికి చెందిన ప్రజలకు అవసరమైన నీటి వనరు అయిన ఈ చెరువు, ఇప్పుడు రిసార్ట్ కోసం ఆక్రమించారు. చెరువు మధ్యలో గదులు నిర్మించి వాటిని లగ్జరీ వాటర్ విలాస్‌గా ప్రమోట్ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం
ఈ అక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన బిగ్ టీవీ చానల్ ప్రతినిధిపై.. రిసార్ట్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. వీడియోలు తీస్తున్న జర్నలిస్టుపై రెచ్చిపోయిన వారు, తాము పెంచుకున్న కుక్కను ఉసిగొల్పిన దారుణ ఘటన.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తించిన రిసార్ట్ యాజమాన్యం.. చర్యలకు పాల్పడిందని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. దీనిపై విపక్షాలు కూడా స్పందిస్తూ.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?
ఇంత వివాదాస్పద అంశాల మధ్య, స్థానిక రెవెన్యూ, గ్రామపంచాయతీ, మునిసిపల్, వన్యప్రాణుల సంరక్షణ శాఖలు మాత్రం.. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను విక్రయించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధమైతే, వాటిపై నిర్మాణాలు చేపట్టడం ఇంకా తీవ్రమైన నేరం. అయినప్పటికీ అధికార యంత్రాంగం మౌనంగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రజల్లో ఆగ్రహం, చర్యలకై డిమాండ్
ఈ ఘటనలపై స్థానిక ప్రజలు, రైతు సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రజలకు దక్కాల్సిన భూములు, నీటి వనరులు కొందరు కార్పొరేట్ లాభాల కోసమే.. ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నారు. ది వైల్డర్‌నెస్ రిసార్ట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ భూములను తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో, సంబంధిత శాఖల సమగ్ర విచారణ అవసరమైంది. అధికారుల మౌనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా స్పందిస్తే తప్ప, న్యాయం జరగదు అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మరోవైపు వికారాబాద్‌లో ది వైల్డర్‌నెస్ రిసార్ట్‌లో ఇద్దరు చనిపోయిన ఘటనపై కేసు నమోదు చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎఫ్‌.ఐ.ఆర్‌ని చూస్తే అర్థమవుతోంది. ఘటనపై BNS 106(1) కింద పోలీసులు నామమాత్రపు సెక్షన్ పెట్టారు. తెలియని నిర్లక్ష్యం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు.

Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్.. టూర్‌ షెడ్యూల్‌ ఇదే!

అనుమతులు లేకుండానే రిసార్ట్‌ నిర్వాహకులు బోటింగ్‌కు అనుమతించడం తప్పని పోలీసులకు తెలియదా? లైఫ్‌ జాకెట్లు ఇవ్వకుండా పంపిస్తే ప్రమాదమని రిసార్ట్ నిర్వాహకులకు తెలియదా? ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ పర్యాటకులను పంపించిన వాళ్లను ఏం చేయాలి? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్‌ టు మర్డర్‌ కేస్ ఎందుకు పెట్టలేదు? BNS 105 సెక్షన్ కింద FIRను ఎందుకు నమోదు చేయలేదు? ఎఫ్‌ఐఆర్‌ని చూస్తే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. నిందితుని పేరే లేకుండా FIR నమోదు చేశారు… పోలీసులు. ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోయారో FIRలో నమోదు చేయకపోవడంతో.. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×