E-Paper
Advertisement

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం!
Advertisement

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్వార్‌ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న యూ-టర్న్‌ వద్ద ఒక ట్యాంకర్.. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్‌ వైపు నుంచి జహీరాబాద్‌కు వేగంగా వస్తున్న ఒక ట్యాంకర్, కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాజగిరి గ్రామానికి చెందిన కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: మెమోలు ఇచ్చాం.. హెచ్చరించాం.. ఇక నెక్స్ట్ సీరియస్ ‘యాక్షనే’!

Tags

Related News

కేబీఆర్ పార్క్ వద్ద వన్-వే ట్రాఫిక్.. వాహనదారులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

మిస్సింగ్ కేసుల్లో ఇకపై ఆటలు సాగవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

ఆస్పత్రి ఖర్చులకు భయపడక్కర్లేదు.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్రం బంపర్ ఆఫర్!

ఉప్పరపల్లి ప్లాట్ల సమస్యపై ‘ప్రజావాణి’లో వినతి.. స్పందించిన డాక్టర్ చిన్నారెడ్డి

పోలీస్ శాఖలో ‘ఆ నలుగురు’ కథ క్లోజ్?.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!

మార్పుల్లేవ్.. రాంచందర్‌తోనే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ?

మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

Big Stories

Advertisement
×