YS Jagan: వైసీపీ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసినట్టు కనిపిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్పై నిరుద్యోగుల ఆక్రోశం, వీధుల్లో చెలరేగిన ఆందోళనలు వైసీపీకి కొత్త రాజకీయ ఊపిరి ఊదాయి. కేడర్లో పెరిగిన జోష్ను ఆయుధంగా మార్చుకుని.. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు… ప్రభుత్వ నిర్ణయాలు… ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
సభకు జగన్ హాజరై గళమెత్తుతారా?
అయితే, అందరి దృష్టి మాత్రం అసెంబ్లీ అంశంపైనే ఉంది. సభకు జగన్ హాజరై గళమెత్తుతారా? లేదంటే బహిష్కరణ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తున్నారా అన్నది రేపటి మీటింగ్లో తేలిపోనుంది. మరోవైపు, ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తే లేదని పాలకపక్షం తెగేసి చెబుతున్న వేళ… ప్రజల్లోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని, గేర్ మార్చబోతున్న ఈ సమావేశం తర్వాత ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.