E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పరిషత్ ఎన్నికలకు పచ్చజెండా.. వచ్చే నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు..!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పరిషత్ ఎన్నికలకు పచ్చజెండా.. వచ్చే నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు..!
Advertisement

Parishad Elections: స్వేచ్ఛ బ్యూరో: జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో రాజకీయ పార్టీల్లో పరిషత్ సందడి మొదలైంది. ఈ ఎన్నికలో గత సంవత్సరం సెప్టెంబర్ లో జరుగుతాయని భావించినా రిజర్వేషన్ల కేటాయింపుపై కోర్టు కేసుల్లో కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావాహులు పదవులు పొందారు.తాజాగా ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జడ్పిటిసి ఆశావాహుల్లో సందడి మొదలైంది.

50% లోపు రిజర్వేషన్లు..

జిల్లాలో 13 మండలాలు ఉండగా 13 జడ్పిటిసి లకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియలో అధికంగా బీసీలకు కేటాయించడంతో జనరల్ స్థానాలు తగ్గాయి.అయితే రిజర్వేషన్ల మార్పుల్లో బీసీ రిజర్వుడు సీట్లు తగ్గించి 50% లోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండేలా నిర్ణయం తీసుకోనుండడంతో రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈసారి జడ్పీ లపై జెండా ఎగరవేయాలని అధికార కాంగ్రెస్,బిఆర్ఎస్ ,బిజెపి పార్టీలు పావులు కదుపుతున్నాయి. మండలాల వారిగా తనకు కలిసి వచ్చే స్థానాలపై ఆశావాహులు పార్టీలు ఓటర్ల మొగ్గు తదితర అంశాలపై కసరత్తును ప్రారంభించారు.

Advertisement

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు మే నెలలో తీపి కబురు..?

మొదలైన ముసాయిదా ప్రక్రియ

ఎన్నికల సన్నాహక ప్రక్రియ ప్రారంభించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.ఇప్పటికే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం పరిషత్ ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2025 జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీచేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం..

Advertisement

ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను, మండలాల వారిగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది.వీటి ఆధారంగానే ఎంపిటిసి, జడ్పిటిసిల పరిధిలోని జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరించిన అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధించాలని పేర్కొంది. అందుకు అనుగుణంగా ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. అభ్యంతరాలు,సలహాలు,సూచనలు పరిగణనకు తీసుకొని తుది జాబితాన్ని విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్స్ లు ఇతర ఏర్పాట్లు చేయనున్నారు.

Also Read: ఫ్యూచ‌ర్ సిటీ క‌మిష‌న‌రేట్‌కు రేవంత్ పునాది… పోలీస్ అధికారుల‌నే వెంటాడుతామ‌నే అహం హ‌రీశ్‌ది!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×