BigTV English

School girls molested : 50 మంది పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులు.. నిందితులలో మహిళా టీచర్!

School girls molested : “ఆ టీచర్ మమ్మల్ని ఒక గదిలోకి పంపేది. ఆమె చెప్పినట్లు వినకుంటే కఠినంగా శిక్షిస్తుంది. ఆ గదిలోకి వెళ్లగానే అతను మా మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. చాలా అశ్లీల మాటలు చెప్పేవాడు. ఆ తరువాత అతను ..” అని ఒక పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినులు మీడియా ముందు చెబుతూ ఏడ్చేశారు.

School girls molested : 50 మంది పాఠశాల బాలికలపై లైంగిక వేధింపులు.. నిందితులలో మహిళా టీచర్!

School girls molested : “ఆ టీచర్ మమ్మల్ని ఒక గదిలోకి పంపేది. ఆమె చెప్పినట్లు వినకుంటే కఠినంగా శిక్షిస్తుంది. ఆ గదిలోకి వెళ్లగానే అతను మా మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. చాలా అశ్లీల మాటలు చెప్పేవాడు. ఆ తరువాత అతను ..” అని ఒక పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థినులు మీడియా ముందు చెబుతూ ఏడ్చేశారు. ఈ ఘటన హర్యాణాలో జరిగింది.


హర్యాణా రాష్ట్రంలోని జీంద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే దాదాపు 60 మంది బాలికలు.. ఢిల్లీ మహిళా కమీషన్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో 50 మందిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఇందుకు మరో 10 మంది బాలికలు ప్రత్యక్ష సాక్ష్యులుగా సంతకాలు చేశారు. ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా మహిళా కమీషన్ చర్యలు తీసుకుంది. హర్యాణా మహిళా కమీషన్‌ను రంగంలోకి దింపింది.

స్కూల్‌కు విచారణ కోసం చేరుకున్న హర్యాణా మహిళా కమీషన్‌ అధికారులు స్వయంగా ఆ బాలికలను కలిసి విషయం తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ కర్తార్ సింగ్ కీచక కార్యాలలో ఒక మహిళా టీచర్ అతనికి సహాయం చేసేదని తేలింది. దీంతో ఆ స్కూల్ కమిటీ అక్టోబర్ 27న ప్రిన్సిపాల్, నిందితురాలైన మహిళా టీచర్‌ను సస్పెండ్ చేసింది. కానీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.


సస్పెండైన ప్రిన్సిపాల్, మహిళా టీచర్ బాలికలను తమ వాంగ్మూలం మార్చాలని ఒత్తిడి చేశారు. ఈ విషయం మళ్లీ మహిళా కమీషన్ దృష్టికి వెళ్లగా.. వారు పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని స్కూల్ కమిటీని ప్రశ్నించారు. పోలీసులకు వెంటన ఫిర్యాదు చేయడంతో.. ప్రిన్సిపాల్ పరారయ్యాడు. కానీ పోలీసులు అతడిని గాలించి పట్టుకున్నారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ కర్తార్ సింగ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణ దశలో ఉంది.

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×