E-Paper
Advertisement

Fire in Flight: గాల్లో ఉండగా విమానంలో మంటలు, భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!

Fire in Flight: గాల్లో ఉండగా విమానంలో మంటలు, భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!
Advertisement

China flight Emergency Landing:

గత కొంతకాలంగా తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు సమస్యలతో విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రయాణీకులో మరింత భయం పెరిగింది. అయినప్పటికీ, ఎక్కడో ఒక చోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. వెంటనే పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ముప్పు తప్పింది.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఈ ఘటన ఎయిర్ చైనాకు చెందిన విమానం CA 139లో జరిగింది. హాంగ్ జౌ నుంచి సియోల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయిన సుమారు గంట తర్వాత లగేజ్ క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. లగేజ్ క్యాబిన్ నుంచి నల్లటి పొగతో కూడిన మంటలు రావడం కనిపించింది. ఓ ప్రయాణీకుడితో పాటు సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే విషయాన్ని గమనించిన పైలెట్ షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్  చేశాడు. ఓ ప్రయాణీకుడు తీసుకొచ్చిన లగేజీ బ్యాగ్ లో లిథియం బ్యాటరీ ఉండటం వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విమానయాన సంస్థ

Advertisement

ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ చైనా విమానయాన సంస్థ స్పందించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. “CA139 విమానంలోని మంటలు చెలరేగాయి. ఓవర్ హెడ్ బిన్‌ లో ప్రయాణీకుడు ఉంచిన లగేజీ బ్యాగ్ లో లిథియం బ్యాటరీ ఉంది. దాని కారణంగానే ఈ మంటలు చెలరేగాయి. విమానంలో మంటలు ఆర్పేందుకు సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేశారు. వారికి ప్రయాణీకులు కూడా సహకరించారు. ఈ ఘటన నేపథ్యంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అయితే, ఈ ఘటనలు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై విమానాయన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు” అని ఎయిర్ చైనా చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ వీబోలో వెల్లడించింది.

ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే?

ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:47 గంటలకు హాంగ్‌ జౌ జియావోషన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. వాస్తవానికి మధ్యాహ్నం 1 గంటలకు దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ కు చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విమాన భద్రతను పరిశీలించిన తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది.

ప్లైట్ రాడార్ సైట్ ఏం చెప్పిందంటే?

Advertisement

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌ సైట్ Flightradar24 ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. విమానం తూర్పు చైనా తీరం, జపాన్ దక్షిణ ద్వీపం క్యుషు నుంచి దాదాపు సమాన దూరంలో సముద్రం మీదుగా పూర్తిగా వెనక్కి తిరిగి ఉదయం 11 గంటల తర్వాత షాంఘైలో ల్యాండ్ అయిందని వివరించింది.

Read Also: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×