E-Paper
Advertisement

Cherlapally to Tirupati Trains: తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

Cherlapally to Tirupati Trains: తిరుపతికి ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఈ గుడ్ న్యూస్!
Advertisement

Tirupati Special Trains: వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాదీలు పెద్ద సంఖ్యలో తిరుపతికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగుతోంది. తిరుపతికి వెళ్లే రైళ్లన్నీ రద్దీగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి- తిరుపతి మధ్య రెండు వారాల పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. తిరుపతికి రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ రైళ్లు ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా సాయపడుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సమ్మర్ లో భాగంగా తిరుమలకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఈ అదనపు రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లకు సంబంధించి షెడ్యూల్ వివరాలను ప్రకటించింది.

చర్లపల్లి- తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల వివరాలు

Advertisement

⦿ రైలు నెం. 07017 (చర్లపల్లి నుంచి తిరుపతి):

ఈ ప్రత్యేక రైలు  జూన్ 2, 6, 11, 13, 18, 20, 25, 27 తిరుపతికి వెళ్తుంది. అటు జూలై 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీలలోనూ ఈ రైలు చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్లనుంది. ఇక ఈ రైలు ఆయా తేదీలలో రాత్రి 9:35 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10:10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

Advertisement

⦿ రైలు నెం. 07018 (తిరుపతి నుంచి చర్లపల్లి):

ఇక ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా జూలై 30,  ఆగస్టు 2, 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుంచి చర్లపల్లికి రానుంది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 4:40 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Read Also: వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంత? ఆ ఉద్యోగానికి కావల్సిన అర్హతలేంటీ?

ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

ఇక తిరుపతి ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, దద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రాజంపేట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్  క్లాస్ కోచ్‌లు ఉంటాయి.  ఈ రైళ్లను ఉపయోగించుకుని ప్రయాణీకులు ఇబ్బందిలేకుండా తిరుపతికి వెళ్లి రావచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్స్? తక్కువ ఖర్చులో బెస్ట్ 7 కంట్రీస్ ఇవే!

Read Also: ఈ రైళ్లు సికింద్రబాద్‌లో ఆగవు.. ఇకపై చర్లపల్లి, కాచిగూడ నుంచే రాకపోకలు!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×