E-Paper
Advertisement

Train Gantry Collapses: ఆ రూట్ లో ప్రమాదం.. 51 రైళ్లకు అంతరాయం.. ఎన్ని రద్దయ్యాయంటే?

Train Gantry Collapses: ఆ రూట్ లో ప్రమాదం.. 51 రైళ్లకు అంతరాయం.. ఎన్ని రద్దయ్యాయంటే?

Bullet Train Gantry Collapses: అహ్మదాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ గ్యాంట్రీ కూలిపోయింది. బుల్లెట్ ట్రైన్ లైన్ లో స్తంభాల మధ్య కాంక్రీట్ గిడ్డర్ లను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించే భారీ గ్యాంట్రీ జారి పడింది. ఈ ప్రమాదం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అహ్మదాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే 50కి పైగా రైళ్లపై ఎఫెక్ట్ పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

శరవేగంగా గ్యాంట్రీ పునరుద్ధరణ పనులు

ఈ ప్రమాదంపై అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (AFES) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటన రాత్రి 10.28 గంటల సమయంలో జరిగినట్లు తెలిపారు. డి మార్ట్ సమీపంలోని వాట్వా రోడ్‌ లోని హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ లో రెండు స్తంభాల మధ్య స్లాబ్ లాంచింగ్ క్రేన్ కూలిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) సైతం ఈ ఘటనపై స్పందించింది. “మార్చి 23న రాత్రి 11 గంటలకు వాట్వాలో వయాడక్ట్ నిర్మాణం కోసం ఉపయోగించే సెగ్మెంటల్ లాంచింగ్ గ్యాంట్రీలో ఒకటి కాంక్రీట్ గిర్డర్‌ ను ప్రారంభించిన తర్వాత ఒకటి వెనక్కి జారింది. నెమ్మదిగా కింద పడిపోయింది. ఈ ప్రభావం ఆ రైల్వే లైన్ లో నడిచే పలు రైళ్ల మీద పడింది. NHSRCL సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గ్యాంట్రీని పునరుద్ధరించేందుకు రెండు హెవీ డ్యూటీ రోడ్ క్రేన్‌ లతో సహా భారీ యంత్రాలు స్పాట్ కు చేరుకున్నాయి” అని వివరించింది.

కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

రైల్వే గ్యాంట్రీ కూలడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ప్రభావితం అయ్యాయి. సుమారు 50కి పైగా రైళ్లపై ఈ ఎఫెక్ట్ పడిందని పశ్చిమ రైల్వేలోని అహ్మదాబాద్ డివిజన్ వెల్లడించింది. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా షెడ్యూల్‌ ను చెక్ చేసుకోవాలని సూచించింది. కర్ణావతి ఎక్స్‌ ప్రెస్, గుజరాత్ క్వీన్, గుజరాత్ ఎక్స్‌ ప్రెస్ తో పాటు కొన్ని ఇంటర్‌ సిటీలు కలిపి ఇరవై ఐదు రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపింది. శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, ముంబై-గాంధీనగర్ వందే భారత్, సబర్మతి ఎక్స్‌ప్రెస్,  శాంతి ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడినట్లు వెల్లడించింది. హౌరా ఎక్స్‌ ప్రెస్‌ తో సహా ఐదు రైళ్లకు సంబంధించి షెడ్యూల్‌ ను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఓఖా- గోరఖ్‌ పూర్ ఎక్స్‌ ప్రెస్‌ తో సహా మరో ఆరు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గ్యాంట్రీ పనులు పూర్తి చేసి, మళ్లీ యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Read Also: RAC టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? అయితే.. ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే

Tags

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×