E-Paper
Advertisement

East Coast Railway: ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఆ రైళ్లలో అదనపు కోచ్‌లు.. ఇక బెర్త్ కన్ఫార్మ్ పక్కా!

East Coast Railway: ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఆ రైళ్లలో అదనపు కోచ్‌లు.. ఇక బెర్త్ కన్ఫార్మ్ పక్కా!
Advertisement

Indian Railways: ప్రయాణీకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కోస్ట్ రైల్వే (E Co R) తగిన చర్యలు తీసుకుంటున్నది. రద్దీని తగ్గించడానికి కొన్ని రైళ్లలో అదనపు కోచ్‌లను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పలు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

ఏ రైళ్లకు అదనపు కోచ్ లు పెరుగుతాయంటే?  

Advertisement

⦿ విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్‌

విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్‌ రైలుకు ప్రయాణీకుల నుంచి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్‌(రైలు నెం. 58506)కు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (నెం. 58505- గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్‌)కు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ ను ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు కోచ్ ల సంఖ్య పెరగనుంది.

Advertisement

⦿ విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్‌

విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్‌ కు కూడా ప్రయాణీకుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ రైలు(నెం. 58501)కు ఓ స్లీపర్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 58502) కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్‌ కు  ఓ స్లీపర్ కోచ్ ను యాడ్ చేయనున్నారు. ఈ అదనపు కోచ్ లు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.

⦿ భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్‌ ప్రెస్‌

భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్‌ ప్రెస్‌ కు ఆగస్టు 2 నుండి 11 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను, తిరుగు ప్రయాణంలో 20838 జునాగఢ్-భువనేశ్వర్ ఎక్స్‌ ప్రెస్‌కు ఆగస్టు 2 నుండి 11 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను యాడ్ చేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్‌దీప్ వెల్లడించారు.

Read Also:  విశాఖకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్, మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చూడండి!

⦿ సంబల్పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌

ఆగస్టు 1 నుంచి 31 వరకు సంబల్పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌ (రైలు నెం.20809)కు ఒక థర్డ్ AC, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లను యాడ్ చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నెం.20810 నాందేడ్ – సంబల్పూర్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌ కు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఒక థర్డ్ AC, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ ను యాడ్ చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఇక ఆహ్లాదకరంగా ప్రయాణం చెయ్యొచ్చన్నారు.

Read Also:  నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!

Related News

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

Big Stories

Advertisement
×