E-Paper
Advertisement

జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే!

జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే!
Advertisement

South Central Railway New Rules: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రిజర్వేషన్ ఉన్న కోచ్‌ లలో సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం, అనుమతి లేకుండా ప్రవేశించకూడదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే నిబంధనలను కఠినతరం చేసినట్లు వెల్లడించింది. రిజర్వ్‌డ్ కోచ్‌ లలో సాధారణ టికెట్‌తో, సరైన అనుమతి లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులకు ఏకంగా రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రద్దీగా ఉండే రైళ్లలో జనరల్ టికెట్లు తీసుకున్న కొందరు ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లలోకి వెళ్లడం కనిపిస్తోంది. దీనివల్ల ముందుగానే సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు సీట్ల విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రిజర్వ్‌డ్ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికుడిని అతడి సీటులో కూర్చోకుండా అడ్డుకోవడం, ఇబ్బంది పెట్టడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించనున్నారు. ఇలాంటి సందర్భాల్లో రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. టికెట్ ఉన్న ప్రయాణికుడికి అతని రిజర్వ్ చేసిన సీటు, బెర్త్‌ పై పూర్తి హక్కు ఉంటుంది. ఇతరులు ఆ సీటులో కూర్చోవడం, ఖాళీ చేయకుండా ఉండటం, ప్రయాణికుడిని అడ్డుకోవడం లాంటి చర్యలను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించనున్నారు. అందుకే రిజర్వేషన్ లేని ప్రయాణికులు రిజర్వ్‌ డ్ కోచ్‌లలోకి వెళ్లకుండా తమకు కేటాయించిన కోచ్‌ లోనే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

జరిమానా చెల్లించకపోతే కోర్టు చర్యలు

Advertisement

రైల్వే అధికారులు విధించిన జరిమానాను చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. జరిమానా చెల్లించని సందర్భాల్లో కేసును కోర్టుకు పంపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాంటి సందర్భాల్లో కోర్టు ద్వారా రూ.3,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. చిన్న నిబంధన ఉల్లంఘనగా భావించి నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యం కోసమే నిబంధనలు

రిజర్వేషన్ కోచ్‌ లలోకి అనుమతి లేని ప్రయాణికులు ప్రవేశించడం వల్ల రైలులో రద్దీ పెరగడంతో పాటు, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, రాత్రి ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు రైలులో ఎక్కే ముందు తమ టికెట్ ఏ కోచ్‌కు సంబంధించినదో ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. జనరల్ టికెట్ ఉన్నవారు రిజర్వేషన్ కోచ్‌లోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

Advertisement

Read Also: విజయవాడ సహా 15 రైల్వే స్టేషన్లకు మహర్దశ.. PPP మోడల్‌ లో రీడెవలప్‌మెంట్!

Tags

Related News

లోకల్ రైలులో దారుణం.. సీటు కోసం మహిళపై బెల్టుతో దాడి.. ఎంతకు తెగించావ్ రా!

కారు కాదు.. డ్రోన్ కాదు.. ఇదో ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్.. వారెవ్వా భలే ఉందే!

8 దశాబ్దాలకు ఊళ్లోకి అడుగు పెట్టిన బస్సు.. డప్పు దరువులతో స్వాగతం పలికి గ్రామస్తులు!

విజయవాడ సహా 15 రైల్వే స్టేషన్లకు మహర్దశ.. PPP మోడల్‌ లో రీడెవలప్‌మెంట్!

చరిత్రలో తొలిసారి.. రైల్లో కాశ్మీర్‌కు పెట్రోల్, డీజిల్ సరఫరా!

ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ప్రేమ.. 9 వేల మైళ్లు దాటి అమెజాన్‌కు వెళ్లిన యువతి!

ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు.. విమానంలో హైడ్రామా!

Big Stories

Advertisement
×