E-Paper
Advertisement

Sankranti Festival Trains: సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా.. రైల్వే చెప్పిన శుభవార్త మీకోసమే

Sankranti Festival Trains: సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా.. రైల్వే చెప్పిన శుభవార్త మీకోసమే
Advertisement

Sankranti Festival Trains: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అసలే సంక్రాంతి.. ఏ రైలు చూసినా ప్రయాణికులతో నిండి ఉంటుంది. అటువంటి సమయంలో దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ ప్రకటన రైల్వే ప్రయాణికులకు భారీ ఊరటను ఇస్తుందని చెప్పవచ్చు. ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఏకంగా జన సాధారణ్ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంది.

అసలే సంక్రాంతి పండుగ వచ్చేసింది. రవాణా వ్యవస్థ ఈ సమయంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడో సుదూరాన ఉన్నా ప్రజలంతా సంక్రాంతికి గ్రామాల బాట పట్టడం పరిపాటి. అందుకే ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే వాటికి సంబంధించిన ప్రకటనలను సైతం ఇండియన్ రైల్వే విడుదల చేసింది. అలాగే దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ప్రకటించింది. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని జన సాధారణ్ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణాన మధ్య రైల్వే ప్రకటించడం శుభ పరిణామం. ఈ రైళ్లు చర్లపల్లి నుండి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆరు ప్రత్యేక రైళ్లను నేటి నుండి అందుబాటులోకి తీసుకురాగా, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Advertisement

అలాగే 08533 నెంబర్ గల రైలు విశాఖపట్నం నుండి చర్లపల్లి మధ్య ఈనెల 10, 12, 15, 17 తేదీలలో నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుండి 9:45 నిమిషాలకు బయలుదేరుతుందని, అదే రోజు రాత్రి 10:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని వారు తెలిపారు. అలాగే 08538 నెంబర్ గల రైలు చర్లపల్లి నుండి విశాఖపట్నం కు 11, 12, 16, 17 తేదీలలో, 08537 నెంబర్ గల రైలు విశాఖపట్నం నుండి చర్లపల్లి కి 10, 11, 15, 16 తేదీలలో ప్రయాణిస్తుందని తెలిపారు.

Also Read: Post Office Franchise: రూ. 5 వేలతో పోస్టాఫీస్ ప్రాంచైజీ తీసుకోండి, ఇంటి దగ్గరే ఉండి పెద్ద మొత్తంలో సంపాదించండి!

Advertisement

ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, శ్యామలకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో నిలుస్తుందన్నారు. సంక్రాంతికి రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు కోస్తా రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్ల ఏర్పాటుతో రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణికులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×