E-Paper
Advertisement

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!
Advertisement

Indian Railways Train Timings Changed: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం ఇచ్చింది. నవంబర్ నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేయనున్నారు. మొత్తం ఎనిమిది రైళ్లకు సంబంధించిన కొత్త టైమింగ్స్ వేర్వేరు తేదీల్లో అమల్లోకి రానున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించే వారు ముందుగానే కొత్త సమయాలను తెలుసుకుని స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

మైసూరు–కాకినాడ ఎక్స్‌ప్రెస్ టైమింగ్ మార్పు

17290 నంబర్ గల మైసూరు–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరులో సమయం నవంబర్ 7 నుంచి మారుతుంది. ప్రస్తుతం ఈ రైలు మధ్యాహ్నం 3:51 గంటలకు గుంటూరు చేరుకుని 3:56 గంటలకు బయలుదేరుతుంది. ఇకపై మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని 3:05 గంటలకు బయలుదేరుతుంది. అదే విధంగా 17296 హిసార్–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా గుంటూరులో సమయాలు మారనున్నాయి. నవంబర్ 6 నుంచి ఈ రైలు సాయంత్రం 3:40 గంటలకు చేరుకుని 3:45 గంటలకు బయలుదేరుతుంది. ప్రస్తుతం ఈ సమయం 4:11 నుంచి 4:16 గంటల వరకు ఉంది.

చర్లపల్లి–తిరుపతి రైలుకు కొత్త వేళలు

Advertisement

17444 చర్లపల్లి–తిరుపతి ఎక్స్‌ప్రెస్ సమయాల్లో కూడా నవంబర్ 6 నుంచి మార్పులు ఉంటాయి. నడికుడిలో ప్రస్తుతం రాత్రి 7:30 గంటలకు చేరుకుని 7:32 గంటలకు బయలుదేరే రైలు.. ఇకపై 7:19 గంటలకు చేరుకుని 7:20 గంటలకు బయలుదేరుతుంది. పిడుగురాళ్లలో 8:05–8:07 గంటల బదులు 7:38–7:40 గంటలకు, మార్కాపూర్ రోడ్‌లో 9:20–9:22 గంటల బదులు 9:05–9:07 గంటలకు రైలు రానుంది. గిద్దలూరులో 10:05–10:07 గంటలకు, దత్తుమెట్టలో 10:20–10:30 గంటలకు, నంద్యాలలో 11:40–11:45 గంటలకు రైలు ఉండేలా కొత్త షెడ్యూల్ రూపొందించారు.

గుంటూరు–కాచిగూడ రైలు కూడా ముందుగానే!

17251 గుంటూరు–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 4 నుంచి గుంటూరు నుంచి ముందుగానే బయలుదేరుతుంది. ప్రస్తుతం సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరే ఈ రైలు.. ఇకపై సాయంత్రం 6 గంటలకే బయలుదేరుతుంది.

మరో మూడు రైళ్లకు మారిన సమయాలు

Advertisement

20630 తిరువనంతపురం నార్త్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు సత్తెనపల్లిలో నవంబర్ 4 నుంచి కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి. ఉదయం 6:54–6:55 గంటల బదులు 6:44–6:45 గంటలకు రైలు అక్కడ ఆగుతుంది. 17625 కాచిగూడ–రేపల్లె ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్లలో ఉదయం 2:51–2:52 గంటల బదులు 2:41–2:42 గంటలకు చేరుకుని బయలుదేరుతుంది. 17078 తిరుచిరాపల్లి–చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి స్టేషన్లలో సమయాలు మారతాయి. గుంటూరులో 3:05–3:15 గంటల బదులు 2:40–2:50 గంటలకు, సత్తెనపల్లిలో 3:19–3:20 గంటలకు, నడికుడిలో 3:59–4 గంటలకు రైలు ఉంటుంది. అలాగే 17042 తిరువనంతపురం నార్త్–చర్లపల్లి ఎక్స్‌ ప్రెస్ గుంటూరులో సాయంత్రం 5–5:10 గంటలకు, సత్తెనపల్లిలో 5:45–5:46 గంటలకు రానుంది.

సో, ప్రయాణానికి ముందు రైల్వే అధికారిక షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించి, కొత్త సమయానికి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.

Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

Tags

Related News

రైళ్లలో ఇక చెత్తబుట్టలు నిండిపోవు.. ఇండియన్ రైల్వే సూపర్ ప్లాన్!

వర్షాల దెబ్బకు కుంగిన రైల్వే ట్రాక్.. ఏకంగా 14 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు!

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

Big Stories

Advertisement
×