IRCTC e-Pantry Services: ప్రయాణీకులకు మెరుగైన సర్వీసులు అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగు పరిచేందుకు కోసం, ప్రయాణీకులు నచ్చిన ఫుడ్ సీటు దగ్గరే డెలివరీ తీసుకునే ఏర్పాట్లు చేసింది. 25 మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో IRCTC ఈ-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో లేదంటే ఆ తర్వాత ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డ్ చేసుకోవచ్చు. ప్రయాణీకుల సీటు దగ్గరే ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇంతకీ ఈ సర్వీసును ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణీకులకు తాజాగా ఈ గుడ్ న్యూస్ చెప్పింది IRCTC. ఎంపిక చేసిన రైళ్లలో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. IRCTC కొత్త ఈ-ప్యాంట్రీ సర్వీసు ప్రస్తుతం 25 రైళ్లలో అందుబాటులో ఉంది. ప్రయాణీకులు రైలు ఎక్కే ముందు భోజనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొదట వివేక్ ఎక్స్ ప్రెస్ లో ఈ సర్వీసుకు సంబంధించి ట్రయల్ టెస్ట్ చేశారు. సక్సెస్ కావడంతో 25 రైళ్లకు విస్తరించారు. ఈ సేవ టికెట్ ధరలో భోజనం లేని రైళ్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. IRCTC వ్యవస్థకు లింక్ చేయబడిన డిజిటల్ ప్లాట్ఫారమ్ను ఉపయోగించి ముందుగానే ఆహారాన్ని బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
కన్ఫార్మ్ టికెట్ లేదంటే RAC టికెట్ హోల్డర్లు భోజనంతో పాటు వాటర్ ను బుక్ చేసుకోవచ్చు. తమ సీట్ల దగ్గరే వాటిని డెలివరీ తీసుకోవచ్చు. ఈ వ్యవస్థ పారదర్శకతను పెంచుతుంది. డెలివరీని నిర్ధారించడానికి మీరు మీల్ వెరిఫికేషన్ కోడ్ (MVC) పొందుతారు.
బుకింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఆ తర్వాత ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’ ద్వారా IRCTC సైట్/యాప్ లో ఇ-ప్యాంట్రీ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. మీ భోజనం కోసం డెలివరీ సిబ్బందికి చూపించడానికి మీకు నిర్ధారణ కోసం MVC కోడ్ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ సమయంలో ఆ కోడ్ ను సిబ్బందికి చెప్తే సరిపోతుంది.
Read Also: స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలనుందా? సింపుల్ గా ఇలా చేయండి!
ఇ-ప్యాంట్రీ సర్వీసు ఇప్పుడు 25 మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఉంది. వీటిలో వివేక్, పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ లాంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాలు కూడా ఉన్నాయి. ప్రయాణీకుల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వీసును ఇతర రైళ్లకు విస్తరించాలని IRCTC భావిస్తోంది.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!