E-Paper
Advertisement

Indian Railways Record: ఓడియమ్మ.. ఒకే రోజు 3 కోట్ల మంది రైలు ప్రయాణం, రైల్వే చరిత్రలోనే అరుదైన రికార్డు

Indian Railways Record: ఓడియమ్మ.. ఒకే రోజు 3 కోట్ల మంది రైలు ప్రయాణం, రైల్వే చరిత్రలోనే అరుదైన రికార్డు
Advertisement

Indian Railways Crowd: భారతీయ రైల్వే సంస్థ అరుదైన ఘనత సాధించింది. ఒకే రోజు 3 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చి సరికొత్త బెంచ్ మార్క్ ను సృష్టించింది. నవంబర్ 4న ఈ చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఒకే రోజు 3 కోట్ల మంది రైల్వే ప్రయాణం

Advertisement

నవంబర్ 4న దేశ వ్యాప్తంగా నాన్ సబర్బన్ రైళ్లు 1 కోటి 20 లక్షల 72 వేల మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు తీసుకెళ్లాయి. వీరిలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు సంఖ్య 19 లక్షల 43 వేల మంది కాగా, రిజర్వేషన్ చేయించుకోని ప్రయాణీకులు 1 కోటి 1 లక్షా 29 వేల మంది ఉన్నారు. అటు సబర్బన్ రైళ్లలో 1 కోటి 80 లక్షల మంది ప్రయాణించారు. 2024లో అత్యధిక సింగిల్-డే ప్రయాణీకుల సంఖ్యగా రికార్డు సాధించింది. మొత్తం ఒక్క రోజే 3 కోట్లకు పైగా ప్రయాణీకుల గమ్యస్థానాలకు చేర్చి సరి కొత్త బెంచ్‌ మార్క్‌ ని నెలకొల్పింది రైల్వే సంస్థ.

దసరా, దీపావళి, ఛత్ పూజతో పోటెత్తిన ప్రయాణీకులు

Advertisement

దసరా, దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగ సీజన్ కావడంతో లక్షలాది మంది ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది రైళ్ల ద్వారానే తమ గ్రామానికి చేరుకున్నారు. రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక రైళ్లను నడిపించింది. ఈ నేపథ్యంలో అత్యధిక ప్రయాణీకులతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుకూలంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. ఈ పండుగ సీజన్ లో మొత్తంగా 7,750 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గత ఏడాది కేవలం 4,429 ప్రత్యేక రైళ్లను నడిపారు. గతంతో పోల్చితే ఈసారి ఏకంగా 73% ఎక్కువగా ఉంది. అటు పండుగల సీజన్ ముగుస్తున్నందున ప్రత్యేక చర్యలు చేపట్టింది. నవంబర్ 8న ఛత్ పూజ ముగియనుంది. తిరిగి మళ్లీ తమ వర్క్ ప్లేస్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నది. నవంబర్ 8 నుంచి 11 వరకు అదనపు రైళ్లను షెడ్యూల్ చేసింది.

బీహార్, యూపీ, జార్ఖండ్‌ భారీగా రద్దీ   

ఈ ఏడాది బీహార్, యూపీ, జార్ఖండ్ అత్యధిక రద్దీ ఉన్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి మొదలుకొని నవంబర్ 5 వరకు ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సుమారు 6.85 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మొత్తంగా ఈ పండుగ సీజన్ లో గతంలో ఎప్పుడూ లేనంత మందిని తీసుకెళ్లింది భారతీయ రైల్వే సంస్థ.

Read Also:  ఒకే ట్రాక్ మీదకు దూసుకొచ్చిన రెండు రైళ్లు.. లోకో పైలెట్ అలా చేసి ఉండకపోతే, భారీ ప్రమాదం

Tags

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×