E-Paper
Advertisement

Vande Bharat Train: ఈ రూట్‌లో వందే భారత్.. ఫస్ట్ టైమ్ వస్తోంది.. ఇక అక్కడ నో వెయిటింగ్!

Vande Bharat Train: ఈ రూట్‌లో వందే భారత్.. ఫస్ట్ టైమ్ వస్తోంది.. ఇక అక్కడ నో వెయిటింగ్!
Advertisement

Vande Bharat Train: ఒక మంచి వార్త ఆ ప్రజల కోసం వేగంగా దూసుకువచ్చింది. ఆ రాష్ట్రాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విషయమిదే. ఇప్పటివరకు అక్కడ ప్రయాణం అంటే గంటల తరబడి కూర్చోవాలి, ఆగడాలు భరించాలి. కానీ ఇప్పుడు ఆ దారిలో వేగంగా వస్తున్నదేదో ఉంది.

దానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే.. ఆ ప్రాంతాల్లో వాయుమార్గానా, సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ అయింది. మరి మన ఊర్లోనూ వస్తుందా? అనే చర్చలు అక్కడ మొదలయ్యాయి. ఇంతకు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలంటే.. ముందు ఈ కథనం పూర్తిగా చదవండి.

Advertisement

బీహార్‌ రాజధాని పాట్నా దగ్గరుండి గోరఖ్‌పూర్ వరకు.. ఆ మార్గంలో ప్రయాణించే వారంతా ఈ కొత్త రైలు గురించి మాటామాటకీ చెప్పుకుంటున్నారు. పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్.. అలాగే కుశీనగర్, గోరఖ్‌పూర్ వరకు.. ఈ రూట్‌ అంతా ఇప్పుడు వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోంది. ఇదే ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడింది.

ఆ టైమ్ వచ్చిందోచ్..
పాటలిపుత్ర – గోరఖ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఇది బీహార్‌లో మొదటి సెమీ హై స్పీడ్ వందే భారత్ ట్రైన్ కావడం విశేషం. దీనిని ప్రధాని మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. మొత్తం 384 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇది కేవలం కొద్ది గంటల్లోనే పూర్తి చేయనుంది. ఇకపై ఆ మార్గంలో ప్రయాణం చెయ్యాలంటే ఇక బస్సుల్లో చప్పుడు వినాల్సిన అవసరం లేదు.

Advertisement

ఈ రైలు ప్రారంభం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాట్నా, ముజఫర్‌పూర్, గోరఖ్‌పూర్ లాంటి నగరాల్లో ఉన్న మెడికల్, ఎడ్యుకేషన్ సదుపాయాలకు ఇక ప్రజలు వేగంగా చేరుకోవచ్చు. ఆ జిల్లాల యువత, వ్యాపారవేత్తలు, రైతులు.. అందరికీ ఇది ప్రయోజనం చేకూర్చుతుంది. ఇది కేవలం రవాణా మార్గమే కాదు, ప్రాంతీయ అభివృద్ధికి వేయబడ్డ ఫస్ట్ ట్రైన్.

ప్రయాణికుల మాటల్లో చెప్పాలంటే.. ఇది కేవలం ట్రైన్ కాదు, ఆశల వెనక పట్టుకుని వచ్చిన అభివృద్ధి రేఖ. పర్యాటక రంగానికి ఇది పెద్ద ఊతం. కుశీనగర్‌లో బౌద్ధ పర్యాటక కేంద్రాలు, చంపారన్ ప్రాంతాల్లో సాంస్కృతిక గమ్యాలకి ఈ ట్రైన్ ద్వారా యాక్సెస్ పెరుగుతుంది.

Also Read: Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ స్పెషల్ వీడియో.. ఇది చూశారంటే ఆగలేరు!

ఇది కేవలం వేగంగా వెళ్లే రైలు మాత్రమే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు, విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఒక నూతన అవకాశంగా మారుతోంది. గోరఖ్‌పూర్ నుంచి పాట్నా వరకు ఇదే మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాకెట్ వేగంతో పయనించనుంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు పల్లెలకు, పట్టణాలకు మధ్య ఓ వారధిలా నిలుస్తోంది. దీని వల్ల రైల్వే స్థాయిలో ప్రాంతీయ సమతుల్యత పెరుగుతుంది. ఉద్యోగాలు, సేవలు, మార్కెట్ యాక్సెస్ అన్నీ పెరుగుతాయి. ఉత్తర బీహార్, ఈస్టర్న్ యూపీ ప్రాంతాలకు ఇది కొత్త ఉత్సాహం ఇవ్వనుంది.

ప్రజల్లో ఈ ట్రైన్‌పై ఏర్పడిన ఉత్సాహం చూస్తే, ఇది ఎప్పటికీ మారని రూట్ కాదని, ప్రతి రోజు ప్రయాణంలో భాగమవుతుందనిపిస్తోంది. వందే భారత్ ఇప్పుడు అక్కడ ఓ సాధారణ ప్రయాణ మార్గం కాదు.. అది అభివృద్ధికి సింబల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఊరికి కూడా వస్తోంది.. వేగంగా, హుందాగా, గర్వంగా.. వందే భారత్!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×