E-Paper
Advertisement

Book Entire Train: ఫ్రెండ్స్ తో టూర్ ఫ్లాన్ చేస్తున్నారా? సింఫుల్ గా ట్రైన్ కోచ్ బుక్ చేసుకోండిలా!

Book Entire Train: ఫ్రెండ్స్ తో టూర్ ఫ్లాన్ చేస్తున్నారా? సింఫుల్ గా ట్రైన్ కోచ్ బుక్ చేసుకోండిలా!

Indian Railway: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. అవసరాలను బట్టి కోచ్ మొత్తాన్ని ఇంకా జనాలు ఎక్కువగా ఉంటే రైలు మొత్తాన్ని బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి పెళ్లిళ్లు, టూర్లకు వెళ్లాలి అనుకుంటే మొత్తం కోచ్ ను లేదంటే కోచ్ లను ఇంకా జనాలు ఎక్కువగా ఉంటే మొత్తం రైలును బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు రైల్వే స్టేషన్ కు వెళ్లి కౌంటర్ లో మొత్తం ప్రయాణానికి సంబంధించి ఒకే టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ లైన్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కోచ్ మొత్తాన్ని ఎలా బుక్ చేసుకోవాలంటే?

పెళ్లిళ్లు లేదంటే కంపెనీ ఉద్యోగుల మీటింగ్ లాంటి సమయంలో ఒకేసారి మొత్తం కోచ్ లేదంటే రెండు, మూడు కోచ్ లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ. ఎక్కువ మంది ఒకేసారి రైల్వే ప్రయాణం చేయాల్సిన సందర్భంలో ఈ సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది. ఒక రైలు కోచ్ ను మొత్తాన్ని బుక్ చేసుకోవాలంటే ముందుగా IRCTCకి చెందిన FTR వెబ్‌ సైట్ www.ftr.irctc.co.inను ఓపెన్ చేయాలి. యూజర్ ఐడీతో లాగిన్ కావాలి.  మీరు కోచ్‌, లేదంటే రైలును బుక్ చేసుకునే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఏది కావాలంటే దానిపై ట్యాప్ చేయాలి. మీ ప్రయాణానికి సంబంధించి పూర్తి వివరాలను అందులో ఎంటర్ చేయాలి. ప్రయాణం చేయాల్సిన డేట్, కోచ్ కు సంబంధించిన వివరాలను అందివ్వాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. మీకు మొత్తం కోచ్ బుక్ చేయబడుతుంది. మొత్తం కోచ్ ను బుక్ చేసే సమయంలో ప్రతి ప్రయాణీకుడి వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కోచ్ ఒకే వ్యక్తి పేరు మీద బుక్ చేయబడుతుంది.

35 శాతం ఎక్కువ ఛార్జ్.. రూ. 50 వేల సెక్యూరిటీ డిపాజిట్

ఇక మీరు రైలులోని ఓ కోచ్ పూర్తిగా బుక్ చేసుకుంటే సాధారణ ఛార్జ్ తో పోల్చితే 30 నుంచి 35 శాతం ఛార్జ్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రూ. 50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ డబ్బులను తిరిగి చెల్లిస్తారు.

Read Also: అమెరికాలో అద్భుతమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కాకండి!

రైలు మొత్తం బుక్ చేసుకోవాలంటే?

అవసరాన్ని బట్టి మొత్తం రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఛార్జ్ వసూళు చేస్తారు. జనరల్ గా ఒక రైలులో 18 కోచ్ లు ఉంటాయి. ఈ కోచ్ లు అన్నింటి ఛార్జ్ తో పాటు రైలు ఇంజిన్ ఛార్జ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ ప్రయాణీకులతో పోల్చితే ప్రత్యేకంగా రైలు బుక్ చేసుకున్న వారు ఎక్కువగా ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: ఈ దేశాల్లో మన కరెన్సీ చాలా ఖరీదు, ఒక్క రూపాయి విలువ అక్కడ ఎంత అంటే?

Tags

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×