BigTV English

IRCTC Northeast Tour: IRCTC నార్త్ ఈస్ట్ స్పెషల్ టూర్.. 33 శాతం డిస్కౌంట్ తో 5 రాష్ట్రాలు కవర్!

IRCTC Northeast Tour: IRCTC నార్త్ ఈస్ట్ స్పెషల్ టూర్.. 33 శాతం డిస్కౌంట్ తో 5 రాష్ట్రాలు కవర్!

IRCTC Special Offer: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యాటకుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త స్పెషల్ టూర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. తక్కువ ధరలో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నది. సమ్మర్ హాలీడేస్ నేపథ్యంలో ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలను కవర్ చేసే నార్త్ ఈస్ట్ డిస్కవరీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పర్యటన 14 రాత్రులు, 15 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. భారత్ గౌరవ్ రైలు ద్వారా ఈ నెల 22న ఢిల్లీలో మొదలుకానుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించలా ఈ టూర్ లో టికెట్ ధరలపై ఏకంగా 33 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


5 ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగనున్న టూర్

మొత్తం 15 రోజుల పాటు కొనసాగే ఈ టూర్ నార్త్ ఈస్ట్ లోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయను కవర్ చేస్తుంది. భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలు ఈ రాష్ట్రాల్లోని కీలక నగరాల ద్వారా కొనసాగనుంది. గౌహతి, ఇటానగర్, సిబ్‌ సాగర్, జోర్హాట్, కాజిరంగ, ఉనకోటి, అగర్తాల, ఉదయపూర్, దిమాపూర్, కోహిమా, షిల్లాంగ్, చిరపుంజి లాంటి నగరాలు ఈ టూర్ లో కవర్ అవుతాయి. ఈ రైలు ఈ నెల 22న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ (DSJ) నుంచి ప్రారంభంకానుంది. తర్వాత గౌహతి, నహర్‌ లగున్, సిబ్‌ సాగర్ టౌన్, ఫుర్‌ కేటింగ్, కుమార్‌ ఘాట్, అగర్తాల, దిమాపూర్ వరకు వెళ్లి, తిరుగు ప్రయాణం అవుతుంది.


బోర్డింగ్ స్టేషన్లు ఇవే!

నార్త్ ఈస్ట్ డిస్కవరీ యాత్ర ఢిల్లీ సఫ్దర్‌ జంగ్ నుంచి ప్రారంభం అవుతుంది. ఘజియాబాద్, అలీఘర్, తుండ్ల, కాన్పూర్, లక్నోలో రైలును ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రైలులో మొత్తం 150 సీట్లు ఉంటాయి, వీటిని సుపీరియర్ AC I (కూపే) – 20, సుపీరియర్ AC I (క్యాబిన్) – 38, డీలక్స్ AC II-టైర్ – 36, కంఫర్ట్ AC III-టైర్ – 56గా విభజించారు.

టిక్కెట్ ధరలు ఎలా ఉంటాయంటే?

నార్త్ ఈస్ట్ డిస్కవరీ టూర్ ధరలు రూ. 1,13,700 నుంచి ప్రారంభమై రూ. 1,72,295 వరకు ఉంటాయని IRCTC తెలిపింది.

Read Also: నిజామాబాద్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, 7 రైళ్లు రద్దు, కారణం ఏంటంటే?

ఏ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందంటే?

ఈ పర్యాటనలో భాగంగా అస్సాంలోని పురాతన శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించవచ్చు. బ్రహ్మపుత్ర నదిపై సూర్యాస్తమయ విహారం, గౌహతిలోని ఉమానంద ఆలయం, జోర్హాట్‌ లోని టీ ఎస్టేట్లు, కాజిరంగ సఫారీని చూడవచ్చు. ఇటానగర్‌ లో గొంప బౌద్ధ దేవాలయం, థెరవాడ బౌద్ధ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. త్రిపురలోని రాతి శిల్పాలు, కుడ్యచిత్రాలకు ప్రసిద్ధి చెందిన శైవ స్థలమైన ఉనకోటికి, ఉజ్జయంత రాజభవనం, త్రిపుర సుందరి ఆలయం చూడవచ్చు. నాగాలాండ్ రాజధానిలోని ఖోనోమా గ్రామాన్ని సందర్శించవచ్చు. చిరపుంజి – షిల్లాంగ్ శిఖరం, ఎలిఫెంట్ జలపాతం, నవ్ఖలికై జలపాతంను చూడవచ్చు.

Read Also: వేసవిలోనూ మంచు కురిసే ప్రాంతం.. రోహ్ తంగ్ పాస్ కు వెళ్లడానికి బెస్ట్ టైం ఇదే!

Related News

Vande Bharat: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?

Goa history: ఏంటీ.. గోవాలో ఉన్నది రెండే జిల్లాలా? వీటిలో ఏది బెస్ట్?

Tourist Footfall: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Islands In India: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!

Dussehra 2025: దసరా పండుగ వచ్చేస్తోంది, వీలుంటే కచ్చితంగా ఈ ప్లేసెస్ కు వెళ్లండి!

Indian Railways Staff: 80 రూపాయల థాలీని రూ. 120కి అమ్ముతూ.. అడ్డంగా బుక్కైన రైల్వే సిబ్బంది!

Delhi Railway Station: ఏంటీ.. ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

Big Stories

×