BigTV English
Advertisement

Special Train Service: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. ఆ స్పెషల్ రైలు కొనసాగింపు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Special Train Service: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. ఆ స్పెషల్ రైలు కొనసాగింపు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Special Train Service: ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. ఉత్తర భారత్‌ నుంచి నేరుగా దక్షిణానికి బస్సుల్లో వింత ప్రయాణాలు ఇక మానేయొచ్చు. జైపూర్ నుంచి కోయంబత్తూర్‌కు నడిచే స్పెషల్ రైలు ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ వరకూ అందుబాటులో ఉండనుంది. వరంగల్, విజయవాడ, రెణిగుంట మీదుగా వెళ్లే ఈ రైలు.. మధ్య తరగతి ప్రయాణికులకు ఒక నెట్‌వర్క్ లా మారుతోంది.


జైపూర్ నుంచి కోయంబత్తూర్ వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసును సెప్టెంబర్ 4 వరకు పొడిగించినట్టు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. ఖడ్గ్‌పూర్ రైల్వే డివిజన్‌కు చెందిన అజ్మీర్ – పూరీ మార్గంలో నడిచే ఈ రైలు తాత్కాలిక ఏర్పాటుగా ప్రారంభించినా.. ప్రయాణికుల నుంచి భారీ స్పందన రావడంతో దాని సేవను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

రైల్వే నెంబరు 06181 జైపూర్ – కోయంబత్తూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి వారం గురువారం జైపూర్ నుంచి ప్రారంభమవుతుంది. జైపూర్ స్టేషన్ నుంచి రాత్రి 2.30 గంటలకు బయలుదేరే ఈ రైలు, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నగరాల మీదుగా ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు కోయంబత్తూర్ చేరుతుంది. ఈ రైలు మార్గంలో కోటా, ఉజ్జయిన్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్హార్‌షా, వరంగల్, విజయవాడ, రెణిగుంట, బెంగళూరు క్యాంటన్‌, సేలం, ఎరోడ్, తిరుప్పూర్ వంటి స్టేషన్లు కలవడం విశేషం. అంటే ఈ ట్రైన్ ఉత్తర భారతదేశం నుంచి నేరుగా దక్షిణానికి వెళ్లే వారికి అత్యంత ఉపయోగకరంగా నిలుస్తోంది.


ఇక తిరుగు ప్రయాణానికి వస్తే… రైల్వే నెంబరు 06182 కోయంబత్తూర్ – జైపూర్ స్పెషల్ రైలు ప్రతి ఆదివారం రాత్రి 9.45 గంటలకు కోయంబత్తూర్ నుంచి బయలుదేరుతుంది. ఇది నాలుగో రోజు బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జైపూర్ చేరుకుంటుంది. ఈ రూట్ కూడా అదే స్టేషన్లను కవర్ చేస్తూ ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తోంది.

ఈ రైలు సర్వీస్‌ వలన ప్రయాణికులకు చాలామంది ప్రయోజనం చేకూరుతోంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల ప్రజలు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ప్రయాణించాలంటే ఇది ఒక డైరెక్ట్ లింక్ లా మారుతోంది. గతంలో ఇలా నేరుగా వెళ్లే అవకాశాలు లేకపోవడంతో విమానాల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రత్యేక రైలు వల్ల మధ్య తరగతి, సాధారణ ప్రయాణికులకు సైతం అందుబాటులో ఉండే ప్రయాణ మార్గం సిద్ధమవుతోంది.

Also Read: Pushkaralu Trains: పుష్కరాలకు 40 లక్షల భక్తుల అంచనా.. స్పెషల్ ట్రైన్స్ రంగంలోకి.. ఎప్పుడంటే?

విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు, వైద్యం కోసం ప్రయాణించే వారు ఈ ట్రైన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఖర్చు తక్కువగా ఉండడం, టికెట్లు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో చాలా మంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఈ ట్రైన్ తాత్కాలికంగా ప్రకటించబడినా.. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ పెరగడంతో ఇక సాధారణ సేవగా మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం.

ఇక ఈ రైలు వెళ్తున్న మార్గం చూసినా, దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రధాన పట్టణాలు తలుపులు తెరుస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత ఉపయోగకరంగా ఉందో. కోటా, ఉజ్జైన్, ఇటార్సీ వంటి విద్యా కేంద్రాలు, నాగ్‌పూర్ వంటి పారిశ్రామిక నగరాలు, వరంగల్, విజయవాడ, రేణిగుంట వంటి ప్రధాన రైలు జంక్షన్లు, బెంగళూరు వంటి టెక్ హబ్‌, అలాగే సేలం, ఎరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ వంటి వస్త్ర పరిశ్రమల కేంద్రాలను కలుపుతున్న ఈ ట్రైన్, వ్యాపారులకు కూడా బాగా పనికొస్తోంది.

రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ రైలు ప్రజల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న గొప్ప నిర్ణయం అనే చెప్పాలి. ముఖ్యంగా ఉపాధి కోసం దక్షిణానికి వెళ్లే వలస కార్మికులకు ఇది గొప్ప బహుమతిగా మారింది. అలానే వివాహాలు, పండుగలు, ఇతర కుటుంబ కార్యక్రమాల నిమిత్తంగా రాకపోకలు సాగించే వారికి ఇది లభ్యమయ్యే అరుదైన అవకాశం.

మొత్తం మీద ఈ స్పెషల్ రైలు ప్రకటించిన దానికంటే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఇకపై దీన్ని రెగ్యులర్ సర్వీసుగా మలచాలనే దిశగా రైల్వే ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి మాత్రం సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. అంతవరకు ప్రయాణం అవసరమున్నవారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

Related News

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

Big Stories

×