E-Paper
Advertisement

తక్కువ ధరలో లగ్జరీ విదేశీ టూర్.. ఇండియా నుంచి కేవలం 3 గంటల ప్రయాణం

తక్కువ ధరలో లగ్జరీ విదేశీ టూర్.. ఇండియా నుంచి కేవలం 3 గంటల ప్రయాణం
Advertisement

విదేశాలకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఎక్కువ ఖర్చు అవుతుందనే కారణంతో ఆ ఆలోచనను వాయిదా వేస్తారు. అలాంటి వారికి ఉజ్బెకిస్తాన్ మంచి బడ్జెట్ ఆప్షన్. ఈ దేశంలో తక్కువ ఖర్చుతోనే లగ్జరీ అనుభూతిని ఆస్వాదించవచ్చు. మధ్య ఆసియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్.. భారత్‌కు చాలా దగ్గరగా ఉన్న దేశం. ఢిల్లీ లేదా ముంబై నుంచి విమానంలో కేవలం మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. అందమైన నగరాలు, గొప్ప చరిత్ర, అద్భుతమైన నిర్మాణాలు ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

భారతీయులకు ఎందుకు చవకగా ఉంటుంది?

ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లే భారతీయులకు అనుకూలమైన కరెన్సీ మారకం విలువ ఒక పెద్ద ప్రయోజనం. ప్రస్తుతం ఒక భారతీయ రూపాయికి సుమారు 127 ఉజ్బెకిస్తానీ సోమ్ కరెన్సీ లభిస్తోంది. అంటే రూ.100కు దాదాపు 12,700 నుంచి 13,000 సోమ్ వరకు వస్తాయి.
దీని వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక ప్రయాణం, షాపింగ్, పర్యాటక ప్రదేశాల సందర్శన వంటి ఖర్చులు తక్కువగా ఉంటాయి. తక్కువ బడ్జెట్‌తోనే మంచి సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. అక్కడ మన దేశంతో పోలిస్తే అంతే ధరలు లేదా ఇంకా కాస్త తక్కువే ఉండవచ్చు.

ప్రయాణం కూడా చాలా సులభం

Advertisement

ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లడం చాలామంది అనుకున్నంత కష్టం కాదు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారు ఈ-వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే సులభంగా వీసా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అందువల్ల చిన్న సెలవులకు కూడా ఈ దేశం అనువైన ఎంపికగా మారింది.

చరిత్ర, అద్భుత నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణ

ఉజ్బెకిస్తాన్‌కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు ప్రపంచ ఫేమస్ సిల్క్ రూట్‌లో ఈ దేశం కీలక పాత్ర పోషించింది. సమర్‌కండ్, బుఖారా వంటి నగరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కనిపించే నీలి గోపురాలు, పురాతన మసీదులు, మదరసాలు, ఇస్లామిక్ నిర్మాణ కళ.. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ నగరాల్లో నడుస్తుంటే చరిత్రలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.

Advertisement

Also Read: రాజస్థాన్‌‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? వర్షాకాలంలో ఈ అద్భుత జలపాతాలు తప్పక చూడండి

రుచికరమైన స్థానిక వంటకాలు

ఉజ్బెకిస్తాన్ వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణ. అక్కడి జాతీయ వంటకం ప్లోవ్ (పలావ్) ఎంతో ఫేమస్. తాజాగా తయారుచేసిన బ్రెడ్, గ్రిల్ చేసిన వంటకాలు, సూప్‌లు, సంప్రదాయ స్వీట్లు కూడా రుచి చూడవచ్చు. భారతదేశంతో ఉన్న సాంస్కృతిక సంబంధాల కారణంగా శాకాహారులకు కూడా అనేక రకాల రుచికరమైన వంటకాలు సులభంగా లభిస్తాయి.

ఆతిథ్యం మరింత ప్రత్యేకం

ఉజ్బెకిస్తాన్ ప్రజలు.. అతిథులను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. వారి స్నేహపూర్వక స్వభావం ప్రతి ప్రయాణికుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. పురాతన కట్టడాలను సందర్శించడం, స్థానిక మార్కెట్లలో షాపింగ్ చేయడం, సంప్రదాయ వంటకాలను ఆస్వాదించడం వంటి అనుభవాలు ఈ యాత్రను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.

తక్కువ ప్రయాణ సమయం, సులభమైన ఈ-వీసా, అనుకూలమైన కరెన్సీ మారకం విలువ, గొప్ప చరిత్ర, అద్భుత నిర్మాణాలు, రుచికరమైన ఆహారం, ఆతిథ్యం వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉజ్బెకిస్తాన్‌లో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌తో లగ్జరీ విదేశీ విహారాన్ని ఆస్వాదించాలని భావించే భారతీయులకు ఉజ్బెకిస్తాన్ అత్యుత్తమ ట్రావెల్ డెస్టినేషన్స్‌లో ఒకటిగా నిలుస్తోంది.

Related News

ఈ రైల్వే స్టేషన్లలో ఫుడ్ టేస్ట్ చేసేందుకు క్యూ కట్టేస్తారు.. మీరూ అక్కడ దిగితే తినకుండా అస్సలు వెళ్లొద్దు!

రాజస్థాన్‌‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? వర్షాకాలంలో ఈ అద్భుత జలపాతాలు తప్పక చూడండి

వందే భారత్ క్రేజీ ఫుడ్ మెనూ.. బ్రేక్‌ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా?

13 దేశాలు చుట్టేసే ఏకైక రైలు.. దీని టికెట్ ధర ఎంతో తెలుసా?

4 వేల కి.మీ దూరంలో ఇండియాలా కనిపించే మరో దేశం.. భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం!

ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న భోగాపురం ఎయిర్‌ పోర్ట్.. లోపల చూస్తే కళ్లు చెదిరిపోవల్సిందే!

వందేభారత్‌ రైల్లో స్పెషల్ కమాండోలు.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×