BigTV English
Advertisement

Luggage In Train: రైలు ప్రయాణం చేస్తున్నారా? పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఇబ్బందులు తప్పవు!

Luggage In Train: రైలు ప్రయాణం చేస్తున్నారా? పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఇబ్బందులు తప్పవు!

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నది. ప్రయాణీకులకు అనుకూలంగా పలు చర్యలు చేపడుతున్నది. చాలా మంది తరచుగా రైలు ప్రయాణం చేస్తున్నప్పటికీ, పెద్దగా రైల్వే నియమ నిబంధనల గురించి తెలియదు. రైల్వేకు సంబంధించి ఓ కీలక నిబంధన గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


నిత్యం కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తారు. ఎంతో కొంత తమతో పాటు లగేజీని తీసుకెళ్తారు. అయితే, ఒక్కో ప్రయాణీకుడు రైల్లో ఎంత పరిమితి వరకు లగేజీ తీసుకెళ్లాలి? అనే విషయంలో పెద్దగా క్లారిటీ ఉండదు. ఒక్కోసారి పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే రైల్వే ప్రయాణం చేసే ప్యాసింజర్లు ఎంత పరిమితిలో లగేజీ తీసుకెళ్లాలి? లగేజీ పరిమితి ఆయా క్లాసులకు వేర్వేరుగా ఉంటుందా? ఒకవేళ పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉంది?


భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం సాధారణంగా ఒక్కో ప్రయాణీకుడు 40 నుంచి 70 కిలోల లగేజీనికి ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.  అయితే, ఆయా క్లాస్ ను బట్టి లగేజీ పరిమితి మారుతుంది. రైల్లోని ఫస్ట్ ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్యాసెంజర్లు 70 కిలలో వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంతకు మించి లగేజీ తీసుకెళ్లాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకెండ్ ఏసీలో ప్రయాణించే వాళ్లు 50 కిలలో వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏసీ ప్రయాణీకులు 40 కిలలో లగేజీ తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు సైతం 40 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఒకేవేళ పరిమితికి మించితే ముందుగానే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతి లేకుండా ఎక్కువ మోతాదులో లగేజీ తీసుకెళ్తే రైల్వే అధికారులు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Read Also: ఈ రైల్లో టికెట్ లేకుండానే జర్నీ చెయ్యొచ్చు, మీరూ ఓసారి ట్రై చేయండి!

లగేజీపై పరిమితులు ఎందుకంటే?

వాస్తవానికి గతంలో రైల్వే ప్రయాణీకులు ఇంతే మోతాదులో లగేజీ తీసుకెళ్లాలనే నిబంధన ఏమీ లేదు. కానీ, ప్రయాణీలు ఒక్కోసారి పెద్ద మొత్తంలో లగేజీతో స్టేషన్ కు రావడంతో పాటు రైలు ఎక్కే సమయంలో ఇబ్బందులు తలెత్తడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రైలు ప్రయాణీకులు తీసుకెళ్లాల్సిన లగేజీ మీద పరిమితులు విధించారు. ఆయా క్లాసులను బట్టి 40 నుంచి 70 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఈ నిబంధనతో రైలు ఎక్కే సమయంలో ప్రయాణీకులకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదని అధికారులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో లగేజీని తీసుకెళ్లాల్సి ఉంటే ముందుకు రైల్వే అధికారులను చెప్పాలని సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంటుందంటున్నారు.

Read Also: మహా కుంభమేళా స్పెషల్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో అయోధ్య, వారణాసి చూసే అవకాశం!

Related News

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Big Stories

×