E-Paper
Advertisement

Train Travel For Free: ఈ రైల్లో టికెట్ లేకుండానే జర్నీ చెయ్యొచ్చు, మీరూ ఓసారి ట్రై చేయండి!

Train Travel For Free: ఈ రైల్లో టికెట్ లేకుండానే జర్నీ చెయ్యొచ్చు, మీరూ ఓసారి ట్రై చేయండి!
Advertisement

Indian Railways: భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ తప్పకుండా ఉండాలి. ఒకవేళ టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అయితే, ఓ ట్రైన్ లో మాత్రం టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ రైలు ప్రారంభం  నుంచి ఉచితంగానే ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే సంస్థ.

ఇంతకీ ఈ స్పెషల్ రైలు ఎక్కడ ఉందంటే?

Advertisement

టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఏకైక రైలు హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ మధ్య నడుస్తున్నది. ఈ రైలు పేరు భాక్రా-నంగల్ రైలు. ఇందులో జర్నీ చేయాలంటే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రైల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చు. ఈ రైలు భాక్రా-నంగల్ ఆనకట్ట సమీపంలోని సుమారు 13 కిలో మీటర్ల మేర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. భాక్రా-నంగల్ పరిసర ప్రాంత ప్రజలతో పాటు డ్యామ్ చూడ్డానికి వచ్చే పర్యాటకులు ఈ ట్రైన్ లో జర్నీ చేస్తారు.

ఎందుకు ఈ రైలు ఉచిత సేవలు అందిస్తుందంటే.

Advertisement

ఈ రైలు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లోకి వెళ్లాలి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అధికార పగ్గాలు చేపట్టగానే పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు. ఇందులో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే నార్త్ ఇండియాలో భాక్రా-నంగల్, సౌత్ ఇండియాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించారు. 1948లో భాక్రా-నంగల్ ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు కార్మికులతో పాటు అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్యామ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్థానికులతో పాటు పర్యాటకుల కోసం ఉచితంగా ఈ రైలును నడపాలని నిర్ణయించారు.

Read Also: మహా కుంభమేళా స్పెషల్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో అయోధ్య, వారణాసి చూసే అవకాశం!

రోజూ  800 మంది ప్రయాణం

ఇక భాక్రా-నంగల్ రైలు సర్వీస్ మొదలైన తొలినాళ్లలో స్టీమ్ ఇంజిన్ ఉండేది. సుమారు 6 సంవత్సరాలత తర్వాత 1953లో  ఆధునిక ఇంజిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు రైలు ఇంజిన్లను మార్చుతూ వచ్చారు. ఇక ఈ ఫ్రీ రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి పొద్దున 7:05 గంటలకు బయల్దేరుతుంది. 8:20 వరకు భాక్రాకు చేరుకుంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతుంది. మళ్లీ మధ్యాహ్నం 3:05 గంటలకు నంగల్ నుంచి బయల్దేరి సాయంత్రం 4:20కి భాక్రా స్టేషన్ కు చేరుకుంటుంది.  ఈ రైలు సేవలను స్థానికులు, విద్యార్థులు, పర్యాటకులు వినియోగించుకుంటున్నారు.  ఈ రైలు ప్రయాణం కొండలు, గుట్టల నడుమ ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. అటు ఈ రైలును వారసత్వం సంపదగా గుర్తించాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తున్నది.

Read Also: ట్రైన్ జర్నీ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటిస్తే మరింత ఆహ్లాదకరంగా వెళ్లొచ్చు!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×