E-Paper
Advertisement

Indian Toy Trains: ఇండియాలో ఇన్ని టాయ్ ట్రైన్స్ ఉన్నాయా? ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!

Indian Toy Trains: ఇండియాలో ఇన్ని టాయ్ ట్రైన్స్ ఉన్నాయా? ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!

Indian Railways: భారత్ టాయ్ ట్రైన్స్ కు అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ రైళ్లన్నీ కనువిందు చేసే ప్రయాణాన్ని అందిస్తాయి. హిల్ స్టేషన్లు, పర్వత ప్రాంతాల ద్వారా ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని కలిగిస్తాయి. ఇంతకీ దేశంలో ఉన్న అద్భుతమైన టాయ్ ట్రైన్స్ ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ కల్కా- సిమ్లా టాయ్ ట్రైన్ (హిమాచల్ ప్రదేశ్)

ఈ రైలు కల్కా నుంచి సిమ్లా వరకు సుమారు 96 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ రైలు 103 సొరంగాలు, 800 కంటే ఎక్కువ వంతెనల మీదుగా ప్రయాణం చేస్తుంది. ప్రకృతి అందాల నడుమ ప్రయాణిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్లో ప్రయాణించాలనుకునే వాళ్లు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) వెబ్‌ సైట్ లేదంటే మోబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కల్కా, సిమ్లా రైల్వే స్టేషన్ల లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

⦿ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (పశ్చిమ బెంగాల్)

ఈ టాయ్ ట్రైన్  డార్జిలింగ్ నుంచి న్యూ జల్పైగురి వరకు ప్రయాణిస్తుంది. సుమారు సుమారు 88 కిలోమీటర్ల పరిధిలో ఈ రైల్వే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో అద్భుతమైన హిమాలయన్ దృష్టాలు పర్యాటకును మంత్రముగ్ధులను చేస్తాయి. దీనిని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ రైలు ప్రయాణం చేయాలనుకునే పర్యాటకులు IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. లేంటే డార్జిలింగ్ రైల్వే స్టేషన్‌ లోనూ టికెట్లు తీసుకోవచ్చు. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

⦿ నీలగిరి మౌంటైన్ రైల్వే (తమిళనాడు)

ఈ రైలు మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకు.. సుమారు 46 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో దట్టమైన అడవులు, తేయాకు తోటలు, అందమైన ప్రకృతి దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రయాణం చేయాలనుకునే వాళ్లు IRCTC వెబ్‌ సైట్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మెట్టుపాళ్యం, ఊటీ రైల్వే స్టేషన్ లోనూ టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

Read Also: దేశంలో అత్యంత పురాతనమైన రైళ్లు ఇవే.. ఎన్నేండ్ల క్రితం పట్టాలెక్కాయో తెలుసా?

⦿ కాంగ్రా వ్యాలీ రైల్వే (హిమాచల్ ప్రదేశ్)

ఈ రైలు పఠాన్‌ కోట్ నుంచి జోగిందర్ నగర్ వరకు ప్రయాణిస్తుంది. దాదాపు 164 కిలోమీటర్ల మేర ఈ రైల్వే మార్గం విస్తరించి ఉంది. ఈ రూట్ హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించిన సుందరమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే, ఇతర టాయ్ ట్రైన్లతో పోల్చితే ఇక్కడ రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది. IRCTC వెబ్ సైట్ లేదంటే నేరుగా రైల్వే స్టేషన్ లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ మాథెరన్ హిల్ రైల్వే (మహారాష్ట్ర)

నేరల్ నుంచి మాథెరన్ వరకు 21 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవచ్చు. తక్కువ పరిధి అయినా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాథెరన్ టాయ్ ట్రైన్ సాంప్రదాయ ట్రాక్ ఉపయోగించకుండా నడుస్తుంది. ఇది పశ్చిమ కనుమలకు సంబంధించిన ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. ఈ రైల్లో ప్రయాణించాలంటే మాథెరన్ రైల్వే అధికారిక వెబ్‌ సైట్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read Also:  దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కావద్దు!

Tags

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×