BigTV English
Advertisement

Luxurious Railway Stations: ఇండియాలో లగ్జరీ రైల్వే స్టేషన్‌లు.. ఎక్కడెక్కడున్నాయంటే ?

Luxurious Railway Stations: ఇండియాలో లగ్జరీ రైల్వే స్టేషన్‌లు.. ఎక్కడెక్కడున్నాయంటే ?

Luxurious Railway Stations: భారతదేశ నిర్మాణం చాలా గొప్పది. ఇక్కడి రాజభవనాలు, కోటలు నేటికీ ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో, కొన్ని రైల్వే స్టేషన్లు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఇండియాలో రాజభవనంలా కనిపించే రైల్వే స్టేషన్లు చాలానే ఉన్నాయి. వాటి నిర్మాణం, డిజైన్, లైటింగ్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడికి చేరుకోగానే.. మీరు చారిత్రక భవనానికి లేదా పర్యాటక ప్రదేశానికి వచ్చినట్లు అనిపిస్తుంది.


ఈ రైల్వే స్టేషన్లు ఒక ప్రయాణానికి ప్రారంభ లేదా ముగింపు స్థానం మాత్రమే కాదు.. ఆ ప్రాంత సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్పానికి చిహ్నం కూడా. ప్రయాణీకులు ఇలాంటి స్టేషన్లకు మొదటిసారి వెళ్ళినప్పుడు మాత్రం రాజభవనమా అని అనుకుంటారు. భారతదేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లు మనకు రాజభవనాలను గుర్తుకు తెస్తాయి.

ఇదిలా ఉంటే.. లగ్జరీ రైల్వే స్టేషన్లు దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌లో ఆధునికత, సౌకర్యాలు, సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందించడమే కాకుండా.. వాటి నిర్మాణ శైలి, సాంకేతికతతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. భారతీయ రైల్వేలు ఈ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను కూడా అనుసరించాయి. ఇండియాలో ఉన్న లగ్జరీ రైల్వే స్టేషన్లను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


1. హబీబ్‌గంజ్ (రాణీ కమలాపతి) రైల్వే స్టేషన్, భోపాల్:
రాణీ కమలాపతి రైల్వే స్టేషన్‌గా పిలువబడుతున్న ఈ స్టేషన్.. భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం (PPP) మోడల్‌లో అభివృద్ధి చేయబడిన స్టేషన్. ఈ స్టేషన్ ఎయిర్‌పోర్ట్ లాగా నిర్మించబడింది. అంతే కాకుండా ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టికెటింగ్ కౌంటర్లు, ఫుడ్ కోర్టులు, శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలతో పాటు వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ స్టేషన్ భవనం పర్యావరణ హితంగా రూపొందించబడింది. ఇందులో సోలర్ పవర్ తో పాటు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్ భోపాల్‌ను ఒక ఆధునిక నగరంగా హైలైట్ చేస్తుంది.

2. చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), ముంబై:
ముంబైలోని CSMT ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. భారతదేశంలోని అత్యంత ఐకానిక్ రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి. ఈ స్టేషన్ విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించబడింది. దీని నిర్మాణం బ్రిటిష్ కాలం నాటి కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. ఆధునికీకరణలో భాగంగా.. CSMTలో ఏసీ వెయిటింగ్ హాల్‌లు , ఆధునిక టికెటింగ్ కౌంటర్లు, ఆటోమేటెడ్ ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ యొక్క గ్రాండ్ డోమ్, రంగురంగుల గాజు జన్నలు, సున్నితమైన చెక్కిన రాతి నిర్మాణాలు ప్రయాణికులను ఆకర్షిస్తాయి.

3. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్:
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ భారతదేశ రాజధానిలో ఉన్న అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. ఇది ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది. ఇక్కడ ఏసీ వెయిటింగ్ రూమ్‌లు, ఫుడ్ కోర్ట్, శుభ్రమైన టాయిలెట్‌లు, ఉచిత వై-ఫై, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ఉన్నాయి. స్టేషన్ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ కూడా ఉంటాయి. ఈ స్టేషన్ అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేక టికెటింగ్ కౌంటర్లు, సహాయ కేంద్రాలు కూడా ఉన్నాయి.

4. హౌరా రైల్వే స్టేషన్, కోల్‌కతా:
హౌరా రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత చారిత్రాత్మకమైన, రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ ఏసీ లాంజ్‌లు, ఫుడ్ కోర్ట్‌లు, ఆధునిక టికెటింగ్ సదుపాయాలతో పాటు, వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. ఈ స్టేషన్ యొక్క ఆర్కిటెక్చర్ బ్రిటిష్ కాలంనాటి శైలిని ప్రతిబింబిస్తుంది.

5. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది. ఇక్కడ శుభ్రమైన వెయిటింగ్ రూమ్‌లు, ఫుడ్ కోర్ట్, వై-ఫై, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, సీసీటీవీలతో భద్రత కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ స్టేషన్ యొక్క ఆధునికీకరణ హైదరాబాద్ యొక్క టెక్-సిటీ ఇమేజ్‌కు సరిపోతుంది.

Also Read: వైజాగ్ టూర్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

భారతీయ రైల్వేలు ఆధునికీకరణ దిశగా గొప్ప పురోగతి సాధించాయి. ఈ లగ్జరీ రైల్వే స్టేషన్లు ప్రయాణికులకు సౌకర్యవంతమైన , ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా.. మరిన్ని స్టేషన్లు ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేషన్లు భారతదేశ రైల్వే వ్యవస్థ యొక్క ఆధునికత, అభివృద్ధిని ప్రతిబింబిస్తాయి.

Related News

Indian Railway: షాకింగ్.. గుట్కా మరకలు క్లీన్ చేసేందుకు రైల్వే ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Big Stories

×