E-Paper
Advertisement

Winter Train Journeys: శీతాకాలంలో ఛల్ చయ్య చయ్య చయ్యా.. ఈ ట్రైన్ జర్నీ చేస్తే ఉంటుందయ్యా!

Winter Train Journeys: శీతాకాలంలో ఛల్ చయ్య చయ్య చయ్యా.. ఈ ట్రైన్ జర్నీ చేస్తే ఉంటుందయ్యా!
Advertisement

Indian Railways: చలికాలంలో ప్రకృతి అంతా వెండితెరలా మెరిసిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు దుప్పటి పరుచుకోగా, దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు కనువిందు చేస్తుంది. ఈ సమయంలో రైలు ప్రయాణం చేస్తే మాటల్లో చెప్పలేని మధుర అనుభూతి కలుగుతుంది. రైలు విండో దగ్గర కూర్చొని నేచర్ అందాలను చూస్తూ వెళ్తుంటే ఆహా అనిపిస్తుంది. శీతాకాలంలో చేయాల్సిన అద్భుతమైన రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ జమ్మూ-బారాముల్లా రైలు

Advertisement

శీతాకాలంలో చేయాల్సిన బెస్ట్ రైలు ప్రయాణాల్లో ఒకటి జమ్మూ-బారాముల్లా ట్రైన్ జర్నీ. మంచు పరుచుకున్న పర్వతాల నడుమ దూసుకెళ్తుంటే చెప్పలేని ఆహ్లాదం కలుగుతుంది. సుమారు 356 కిలో మీటర్ల మేర ఉన్న ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతులను కలిగిస్తుంది. మంచుతో గడ్డకట్టిన నదుల నుంచి మొదలుకొని, పర్వతాల వరకు కాశ్మీర్ లోయ అందాలను కళ్లకు కడుతుంది. బనిహాల్, కాజిగుండ్ పట్టణాల మీదుగాసాగే ఈ ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుంది.

⦿ కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్  

Advertisement

శీతాకాలంలో తప్పకుండా చేయాల్సిన రైలు ప్రయాణం కల్కా-సిమ్లా టాయ్ జర్నీ. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పొగమంచు పడుతుంటే 102 సొరంగాలు, 864 వంతెనలు పైన్ అడవులు మరింత అందంగా కనిపిస్తాయి.  మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల కనువిందు చేస్తాయి. సూర్యకాంతిలో మెరిసే మంచుగడ్డలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి.

⦿ నీలగిరి మౌంటైన్ రైల్వే

దక్షిణాది రాష్ట్రాల్లో శీతాకాలంలో తప్పకుండా చేయాల్సిన రైలు ప్రయాణం ఇది. మెట్టుపాళ్యం నుంచి ఈటీ వరకు కొనసాగే ఈ ప్రయాణం గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రయాణంగా గుర్తించిన ఈ రైల్వే జర్నీ..  మంచుపడుతుంటే పచ్చని టీ తోటలు, దట్టమైన అడవుల గుండా ముందుకు సాగుతుంది.

⦿ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

శీతాకాలంలో ప్రయాణించాల్సిన మరో చక్కటి రైలు ప్రయాణం డార్జిలింగ్ హిమాలయన్ జర్నీ. న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్‌ వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ప్రకృతి ప్రేమికులకు మర్చిపోలేను అనుభవాన్ని అందిస్తుంది. పచ్చని తేయాకు తోటలు పొగమంచుతో కప్పబడి మరింత రమణీయంగా కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు ఆహా అనిపిస్తాయి.

⦿ మాథెరన్ హిల్ రైల్వే

శీతాకాలంలో ముంబై పరిసరాల్లో ఉంటే కచ్చితంగా మాథెరన్ హిల్ రైల్వే జర్నీని అస్సలు మిస్ కాకూడదు. పొగమంచులో మాథెరన్ పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మానసికంగా మరింత ప్రశాంతతను అందిస్తుంది. ఈ రైలు నెమ్మదిగా ముందుకు కదులుతూ పాతకాలపు వైబ్స్ అందిస్తుంది. పశ్చిమ కనుమల్లో ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తుంది.

⦿ దక్కన్ ఒడిస్సీ

డెక్కన్ ఒడిస్సీ మహారాష్ట్రలో గొప్ప పర్యటన అనుభూతిని కలిగిస్తుంది. గోవా, అజంతా, ఎల్లోరాలో స్టాప్‌ లతో ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో గోవా బీచ్‌లు, ఎల్లోరా గుహలు అదరహో అనిపిస్తాయి.

⦿ కాంగ్రా వ్యాలీ రైల్వే

పఠాన్‌ కోట్ నుంచి మొదలయ్యే ఈ రైలు ప్రయాణం అద్భుతమైన కాంగ్రా వ్యాలీ గుండా కొనసాగుతుంది.  ధౌలాధర్ ప్రాంతాలు మంచు దుప్పటిని ధరించి మరింత ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి.  లోయలు, నదులు, హిల్ స్టేషన్లు కనువిందు చేస్తాయి.

Read Also: లగ్జరీ సౌకర్యాలు, అతి తక్కువ ఛార్జ్.. దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు గురించి తెలుసా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×