E-Paper
Advertisement

Metro Free Ride: వారం రోజులు మెట్రో ఫ్రీ రైడ్.. ఇది కదా ఆఫర్ అంటే!

Metro Free Ride: వారం రోజులు మెట్రో ఫ్రీ రైడ్.. ఇది కదా ఆఫర్ అంటే!
Advertisement

దేశంలోని నగర ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు పలు నగరాల్లో మెట్రో వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో తొలిసారి కోల్ కత్తాలో మెట్రో రైలు సేవలు ప్రారంభం కాగా, ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు సిటీల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో సిటీ చేరబోతోంది. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ లో ని ఇండోర్ లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి (మే 31) నుంచి  మెట్రో సేవలను ప్రారంభిస్తున్నారు. మధ్యప్రదేశ్  నగర రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషించబోతోంది.

వారం రోజుల పాటు ఉచిత మెట్రో ప్రయాణం

Advertisement

మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణీకులకు ఇండోర్ మెట్రో అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణీకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మెట్రో ప్రారంభం అయిన తొలి వారం రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. రెండో వారంలో టికెట్ ధరపై 75 శాతం తగ్గింపు అందిస్తోంది. మూడో వారంలో 50 శాతం తగ్గింపు  అందిస్తోంది. ఆ తర్వాత మూడవ నెల వరకు 25% తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ దశలో అంటే 30 కి.మీ లోపు ఛార్జీ  రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉంటుంది.  31.32 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణాలకు రూ. 30 నుంచి రూ. 80 వరకు ఛార్జీ ఉంటుంది. ప్రయాణీకులు మొదటి వారం ఉచిత ప్రయాణం ఎంజాయ్ చేయాలని మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MPMRCL) సూచించింది. ఆ తర్వాత మూడు నెలల్లో టైర్డ్ డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉందని వెల్లడించింది. మెట్రో రైలు ప్రారంభంలో సూపర్ ప్రియారిటీ కారిడార్ అని పిలువబడే యెల్లో లైన్ 6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. గాంధీ నగర్ నుంచి సూపర్ కారిడార్ 3 వరకు ఐదు కీలక స్టేషన్లను కలిగి ఉంటుంది.

ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రైలు ప్రయాణాలు

Advertisement

రైళ్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 30 నిమిషాలకు ఒకటి నడుస్తుందని మెట్రో అధికారులు వెల్లడించారు. ఒక్కో రైలు ప్రతి దిశలో  రోజూ 25 ట్రిప్పులు వేయనున్నట్లు ప్రకటించారు. ఇండోర్ మెట్రో రైలు 980 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, స్టేషన్లలో లిఫ్ట్‌ లు, ఎస్కలేటర్లు, వికలాంగ ప్రయాణీకులకు బ్రెయిలీ ఇండికేష్స్, టచ్ టైల్స్, CCTV కెమెరాలు, అత్యవసర బటన్లు, ఇంటర్‌ కామ్‌లు, దృష్టి లోపం ఉన్న ప్రయాణీకులకు ఆడియో ప్రకటనలు, వీల్‌ చైర్ యాక్సెస్, సీటింగ్ ప్రాంతాలు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇండోర్ మెట్రో ప్రాజెక్ట్ ను సుమారు రూ. ,500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ మెట్రోను తీర్చిదిద్దారు.

Read Also: దేశాలు, ఖండాలను కలిపే వంతెనలు.. ఈ సరిహద్దులు భలే ఉంటాయ్ బాసు!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×