Charlapalli–Darbhanga Special Train: ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే వన్ వే స్పెషల్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. శీతాకాల ప్రయాణ కాలానికి ముందు పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి, చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే ప్రత్యేక రైలును ప్రకటించింది. బీహార్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ నుంచి సుదూర రైళ్లకు కాలానుగుణ డిమాండ్ బాగా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే రైలు నెంబర్ 07999ను నవంబర్ 19, 2025న నడుపుతుంది. చర్లపల్లి నుంచి దర్భంగాకు ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ రూట్ వన్ వే సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
చర్లపల్లి- దర్భంగా వన్ వే ప్రత్యేక రైలును పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బల్హర్షా, గోండియా, దుర్గ్, రాయ్ పూర్, బిలాస్ పూర్, రూర్కెలా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, ధన్ బాద్, బరౌని లాంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది.
Read Also: పొగ మంచు ఎఫెక్ట్, 24 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే!
ఈ ప్రత్యేక రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు సరసమైన ప్రయాణ ఎంపికలను అందించడం లక్ష్యంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు ఛార్జీల కింద టిక్కెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ రూట్ లో నడిచే రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున ప్రయాణీకులు ముందుగానే ప్లాన్ చేసుకుని, ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి బీహార్ కు వెళ్లే ప్రయాణీకులు ఈ వన్ వే ప్రత్యేక రైలు సర్వీసును ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లు ముందే ప్రకటించండి.. రైల్వే బోర్డుకు లేఖ!