BigTV English
Advertisement

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ లో విమాన సేవలు రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నగరాలను కనెక్ట్ చేసేలా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాల మధ్య విమాన సేవలు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు.


రాజమండ్రి నుంచి నేరుగా తిరుపతికి విమానం

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్లు రామ్మోహన్ నాయు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ మార్గం లో అలయన్స్ ఎయిర్ ATR 72 విమాన సర్వీసులు ప్రారంభించబడతాయన్నారు.

 రాజమండ్రి-తిరుపతి విమానం షెడ్యూల్ వివరాలు

ఇక రాజమండ్రి- తిరుపతి విమానానికి సంబంధించి షెడ్యూల్ ను కూడా ఆయన ప్రకటించారు. అక్టోబర్ 1న ఉదయం 09:25 గంటలకు విమానం తిరుపతి నుంచి రాజమహేంద్రవరం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10:15 గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరుతుంది . అక్టోబర్ 2న నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు నడుస్తాయి. ఈ నూతన సర్వీసు ఉదయం 07:40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, తిరిగి ఉదయం 09:50 గంటలకు రాజమహేంద్రవరం నుండి బయలుదేరుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.


Read Also: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

శ్రీవారి భక్తులకు ఎంతో లాభం

ఈ విమాన సర్వీసు ప్రారంభంతో ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే కాకుండా, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అనేకమంది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు రామ్మోహన్ నాయుడు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనకు అనుగుణంగా ఈ సర్వీసును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో విమాన సర్వీసులను నడిపేందుకు అంగీకరించిన అలయన్స్ ఎయిర్‌ కు  ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ప్రజలు ఈ విమాన సర్వీసులను ఉపయోగించుకోవాలని రామ్మోహన్ నాయుడు సూచించారు.

Read Also: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

Related News

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

Big Stories

×