BigTV English

Secunderabad railway station look: ఇంత అందంగా స్టేషన్ ఉంటుందా? సికింద్రాబాద్ రీడెవలప్‌మెంట్ చూసారా!

Secunderabad railway station look: ఇంత అందంగా స్టేషన్ ఉంటుందా? సికింద్రాబాద్ రీడెవలప్‌మెంట్ చూసారా!

Secunderabad railway station look: ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఎన్నో దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలకు ఇక శుభం కార్డు పడే సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి తర్వాత ఇక స్టేషన్‌కు వచ్చే వారు ట్రైన్ కోసం ఎదురుచూస్తూ గడిపే సమయం ఒక రకంగా మరిచిపోలేని అనుభవంగా మారనుంది. స్టేషన్ పరిసరాల్లో అడుగుపెడితేనే విమానాశ్రయాన్ని తలపించే పరిస్థితి రానుంది.


ఇదో పెద్ద ప్రాజెక్ట్..
ఈ అభివృద్ధికి భారత రైల్వే శాఖ ఏకంగా రూ.715 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మోడర్నైజేషన్ ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ భారీ బడ్జెట్ తో ఉన్నత ప్రమాణాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పనులు వేగంగా సాగుతుండగా, వచ్చే సంవత్సరం చివరినాటికి ఇవి పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఎన్ని దశల నిర్మాణం?
ప్రస్తుతం నిర్మాణం మూడు ప్రధాన దశలుగా సాగుతోంది. మొదటిది.. స్టేషన్ భవనాన్ని పూర్తిగా కొత్త రూపంలో నిర్మించడం. రెండవది.. ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మల్టీ లెవెల్ హాల్‌లు. మూడవది.. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు. స్టేషన్‌కు ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న భవనం, పూర్తిగా గాజు గోడలతో, వైఫై కనెక్టివిటీతో, స్మార్ట్ డిస్‌ప్లేలతో అదిరిపోయే లుక్‌ను కలిగించనుంది.


కొత్త సౌకర్యాలు ఏమిటి?
ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి పలు సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత సమాచార డిస్‌ప్లే బోర్డులు, రియల్ టైం ట్రైన్ స్టేటస్ తెలియజేసే డిజిటల్ ప్యానల్స్, టికెట్ కియోస్క్‌లు, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఫ్లాట్‌ఫారమ్ మార్పులు తెలుసుకునే సదుపాయం ఉన్నాయి. ఇక టాయిలెట్ల విషయానికి వస్తే, ఇవన్నీ సెన్సార్ ఆధారిత హైజెనిక్ సిస్టమ్‌తో ఉండబోతున్నాయి. రోజూ వందలమంది వాడే ఈ వసతులు ఇక తరచూ శుభ్రంగా ఉండేలా డిజైన్ చేశారు.

ఇప్పుడేం జరుగుతోంది?
ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, వీల్‌చైర్ ర్యాంపులు, స్పెషల్ అసిస్టెన్స్ కౌంటర్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు సులభంగా తమ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. ప్లాట్‌ఫారంలన్నీ పూర్తిగా ఎలివేటెడ్ వాక్‌వేస్‌తో కలిపి, వర్షం, వేడి, బరువైన లగేజీ.. ఇవన్నీ దరిచేరని విధంగా రక్షణ కల్పించేలా నిర్మిస్తున్నారు. అదనంగా మల్టీ లెవెల్ పార్కింగ్, క్యాబ్ డ్రాప్ పాయింట్లు, ఆటో స్టాండ్లు, MMTS, మెట్రో కనెక్టివిటీకి అనుసంధానం కలిగేలా ప్లానింగ్ చేస్తున్నారు.

నూతనంగా రూపొందించిన ఫుడ్ కోర్ట్‌ల్లో అంతర్జాతీయ బ్రాండ్లు, ప్రాంతీయ రుచులు ఉండేలా కాంట్రాక్టులు ఇచ్చారు. ప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే ఒక సమస్య.. మోసం చేసే చిన్న హోటళ్ల వల్ల అనారోగ్యం. అయితే ఇప్పుడు ఫుడ్‌ కోర్ట్‌లన్నీ హైజెనిక్, మెనూ డిజిటల్‌గా కనిపించేలా ఏర్పాటవుతున్నాయి. అదే విధంగా, స్వచ్ఛ స్టేషన్ లక్ష్యంగా బయో టాయిలెట్లు, వాతావరణహిత డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

వెయిటింగ్ హాల్స్ విషయంలోనూ భారీ మార్పులు రానున్నాయి. ఎసీ వేటింగ్ లౌంజ్‌లు, ఫ్యామిలీ వేటింగ్ ఏరియాలు, చిన్నారుల కోసం ఆటల ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులు తలనొప్పి లేకుండా ప్రయాణాన్ని ఆనందించగలుగుతారు. మహిళల కోసం ప్రత్యేక లాకర్లు, మెకానైజ్డ్ సానిటరీ నాప్‌కిన్ డిస్పెన్సర్లు అందుబాటులో ఉంటాయి.

Also Read: Indian Railway Modernization: చిన్న స్టేషన్ కు.. హైటెక్ హంగులు.. ఎక్కడంటే?

సెక్యూరిటీ ఇకపై కఠినతరం
ఈ కొత్త డిజైన్‌ ఓ స్మార్ట్ సిటీ స్టేషన్లకు తలమానికంగా ఉండబోతోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, శబ్ద కాలుష్యాన్ని తగ్గించేలా స్పెషల్ ప్యానల్స్, నేచురల్ లైట్ యుటిలైజేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పథకాలు అమలవుతున్నాయి. అంతేకాకుండా, సెక్యూరిటీ కూడా మరింత కఠినంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ అలర్ట్ బటన్‌లు ప్రయాణికుల రక్షణ కోసం ఏర్పాటు చేస్తారు.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, సికింద్రాబాద్ స్టేషన్ కేవలం రైల్వే ప్రయాణానికి మాత్రమే కాదు, ఒక ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. షాపింగ్, ఫుడ్, ట్రావెల్, సర్వీసులన్నీ ఒకే చోట లభించేలా మారుతుంది. ప్రయాణికులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇక స్టేషన్‌లోనే కాస్త సమయాన్ని గడపాలని అనిపించేలా ఉంటుంది.

ఈ మార్పులన్నీ కలసి, సికింద్రాబాద్ స్టేషన్‌ ఇప్పుడు నిజంగా దేశంలో అత్యుత్తమ స్మార్ట్ స్టేషన్లలో ఒకటిగా మారనుంది. రైల్వేలు అంటే కేవలం ట్రైన్లు కాదు, అవి అనుభవాలు. ఆ అనుభవాలను మరింత బాగుచేసే దిశగా ఇది ఒక కొత్త ప్రయాణంగా అధికారులు అంటున్నారు.

Related News

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Big Stories

×