E-Paper
Advertisement

Special Trains: కాకినాడకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, స్పెషల్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Special Trains:  కాకినాడకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, స్పెషల్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Secunderabad- Kakinada Town Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-కాకినాడ నడుమ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు.

ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు?

Advertisement

తాజాగా సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తాయి? రైల్వే షెడ్యూల్ వివరాలతో పాటు ఏ స్టేషన్లలో ఆగుతాయి? అనే విషయాలు వెల్లడించింది.

జూన్ 12 నుంచి ఆగష్టు 1 వరకు..

Advertisement

సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య నడిచే రైళ్లు జూన్ 12 నుంచి ఆగష్టు 1 మధ్య అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం-07041 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) జూన్ 12, 19, 26 తేదీలతో పాటు జూలై 3, 10, 17, 24, 31 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 10:40 గంటలకు బయలుదేరి ఉదయం 10:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇక రైలు నెం-07042 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) కాకినాడ టౌన్ నుంచి సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 13, 20, 27, జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీలలో అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే!

ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు

సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు పలు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ఈ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఈ రైళ్లను ఉపయోగించుకుని ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలని సూచించారు. ఈ రైళ్లు హైదరాబాద్- కాకినాడ మధ్య ప్రయాణాలు చేసే ప్యాసింజర్లకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Read Also:  వందేభారత్ రైలులో జ్యూస్ తాగుతున్నారా? జాగ్రత్త, మీకు ఇలాంటి పరిస్థితి రావచ్చు!

Related News

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

Big Stories

Advertisement
×