BigTV English
Advertisement

Special Trains: కాకినాడకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, స్పెషల్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Special Trains:  కాకినాడకు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, స్పెషల్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Secunderabad- Kakinada Town Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-కాకినాడ నడుమ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు.


ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు?

తాజాగా సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తాయి? రైల్వే షెడ్యూల్ వివరాలతో పాటు ఏ స్టేషన్లలో ఆగుతాయి? అనే విషయాలు వెల్లడించింది.


జూన్ 12 నుంచి ఆగష్టు 1 వరకు..

సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య నడిచే రైళ్లు జూన్ 12 నుంచి ఆగష్టు 1 మధ్య అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం-07041 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) జూన్ 12, 19, 26 తేదీలతో పాటు జూలై 3, 10, 17, 24, 31 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 10:40 గంటలకు బయలుదేరి ఉదయం 10:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇక రైలు నెం-07042 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) కాకినాడ టౌన్ నుంచి సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 13, 20, 27, జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీలలో అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

Read Also: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే!

ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు

సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు పలు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ఈ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఈ రైళ్లను ఉపయోగించుకుని ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలని సూచించారు. ఈ రైళ్లు హైదరాబాద్- కాకినాడ మధ్య ప్రయాణాలు చేసే ప్యాసింజర్లకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

Read Also:  వందేభారత్ రైలులో జ్యూస్ తాగుతున్నారా? జాగ్రత్త, మీకు ఇలాంటి పరిస్థితి రావచ్చు!

Related News

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Big Stories

×