BigTV English

Bullet Train: అప్పుడే 300 కిమీలు పూర్తి చేసుకున్న బుల్లెట్ రైల్ ట్రాక్.. ఇదిగో వీడియో

Bullet Train: అప్పుడే 300 కిమీలు పూర్తి చేసుకున్న బుల్లెట్ రైల్ ట్రాక్.. ఇదిగో వీడియో

Bullet Train: అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. 300 కిలోమీటర్ల వంతెన పూర్తి అయినట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ (ఎఫ్ఎస్ఎల్ఎం) ద్వారా నిర్మిస్తున్న సూపర్ స్ట్రక్చర్ వీడియోను ఆయన షేర్ చేశారు.


⦿ 3 గంటల్లో 508 కిలోమీటర్లు

భారతదేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌-ముంబయి నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధిచన పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు ఉంటుంది. బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టకు సంబంధించిన స్టేషన్లు గుజరాత్‌లో మొత్తం 8 ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి.


⦿ 350 కిమీ వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు

బుల్లెట్‌ ట్రైన్‌ తొలి ట్రయల్స్‌ను 2026లో చేపట్టనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా బుల్లెట్ ట్రైన్ గంటలకు 350 కి.మీ. వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుందని.. ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానంగా ఉందని పేర్కొన్నారు. అయితే.. ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు వివరించారు.

⦿ ప్రాజెక్ట్ విలువ రూ.1.08 కోట్లు

ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.1.08 లక్షల కోట్లు అని చెప్పారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గుజరాత్, మహారాష్ట్ర చెరో రూ.5000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 2028 నాటికి కంప్లీట్ అవుతోందని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలే ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

Also Read: Vande Bharat Train: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు ఇదే, ఏ రూట్ లో నడుస్తుందంటే?

⦿ 300 KM వంతెన పూర్తి

ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 300 కిలోమీటర్ల వంతెన కంప్లీట్ అయినట్టు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్కొంది. 300 కిలోమీటర్ల సూపర్ స్ట్రక్చర్‌లో 257.4 కిలోమీటర్లు ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ద్వారా నిర్మించామని వివరించింది. వీటిలో 14 నది వంతెనలు, 37.8 కిలోమీటర్ల స్పాన్ బై స్పాన్, 900 మీటర్ల స్టీల్ వంతెనలు , 1.2 కిలోమీటర్ల పీఎస్‌సీ వంతెనలు ఉన్నాయని చెప్పింది.

Also Read: Railway Stations: ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ప్రారంభం, ఎప్పుడో తెలుసా?

Related News

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Big Stories

×