E-Paper
Advertisement

Tirupati Chikkamagaluru Express: తిరుపతి నుండి చిక్మంగళూరుకు కొత్త ఎక్స్ ప్రెస్.. ఈ రూట్ లో జర్నీ అదుర్స్ అనాల్సిందే!

Tirupati Chikkamagaluru Express: తిరుపతి నుండి చిక్మంగళూరుకు కొత్త ఎక్స్ ప్రెస్.. ఈ రూట్ లో జర్నీ అదుర్స్ అనాల్సిందే!

Tirupati Chikkamagaluru Express: తిరుమల శ్రీవారి దివ్య దర్శనం ఒకవైపు.. కాఫీ తోటలతో పచ్చగా మెరిసే చిక్‌మంగళూరు మరోవైపు! ఇప్పుడు ఈ రెండు భిన్నమైన ప్రయాణ లక్ష్యాలను కలిపేస్తూ, ఇండియన్ రైల్వే ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. తిరుపతి – చిక్‌మంగళూరు ఎక్స్‌ప్రెస్ (Train No. 17423/17424) ఈ నెల జూలై 17, 2025 నుంచి పట్టాలెక్కనుంది. ప్రతి వారం నడిచే ఈ రైలు భక్తి, ప్రకృతి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా మారబోతోంది.

ఈ రైలు కాట్పాడి (Katpadi), జోలార్‌పేట (Jolarpettai) మీదుగా వెళ్లుతుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు, తమిళనాడుకు, కర్ణాటకకు ఒక ట్రావెల్ కనెక్టివ్ లాగా నిలవనుంది. తూర్పు ప్రాంతంలోని పుణ్యక్షేత్రం తిరుపతిని, పశ్చిమ ఘాటుల్లో ఉన్న చక్కని పర్యాటక ప్రదేశమైన చిక్‌మంగళూరుతో కలిపే ఈ రైలు సేవ, భక్తులు, ప్రయాణికులు, ప్రకృతి ప్రేమికులందరికీ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఈ రైలులో ప్రయాణం ఎందుకు ప్రత్యేకం?
తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుని, అక్కడి ఆధ్యాత్మికతను అనుభవించిన తర్వాత, చిక్‌మంగళూరులోని హిల్ స్టేషన్లు, బాబా బుదన్ గిరి, ముల్లయనగిరి, కాఫీ తోటలు వంటి ప్రదేశాల్లో విశ్రాంతిని పొందవచ్చు. ఒకే రైలులో భక్తి, సౌందర్యం, ప్రశాంతత అన్నీ కలవడం అరుదైన విషయం.

రైల్వే శాఖ ఈ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభిస్తోంది. ఇందులో జనరల్, స్లీపర్, 3AC తరగతులు ఉంటాయి. రైలు మార్గం మధ్యలో ఆగే ముఖ్యమైన స్టేషన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ఈ రైలు ప్రారంభం ద్వారా, ఇప్పటి వరకు ప్రత్యక్ష రైలు లేని ప్రాంతాల ప్రయాణికులకు తిరుపతికి, లేదా చిక్‌మంగళూరుకు సులభంగా చేరుకునే అవకాశం దక్కనుంది. ముఖ్యంగా కుటుంబంగా వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే ఈ ప్రయాణం, ప్రయాణికులకు కనువిందు చేస్తుంది.

Also Read: Train viral meme: రైల్వే ట్రాక్ పై ధర్నా.. అదే రూట్లో రైలు.. వీడియో చూస్తే నవ్వులే!

చిక్‌మంగళూరు కర్ణాటకలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఇక తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. శ్రీవారి దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు సంవత్సరానికి పలుమార్లు వచ్చే పవిత్ర క్షేత్రం. ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రత్యక్ష రైలు అందుబాటులోకి రావడం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని.. హాలీడే టూరిజాన్ని మరింత ఊపందించనుంది.

ఇప్పటివరకు చిక్‌మంగళూరుకు వెళ్లాలంటే మల్టిపుల్ కనెక్షన్లు అవసరం అవుతుండేవి. కానీ ఇప్పుడు ప్రతి వారం ఒకసారి నేరుగా తిరుపతి నుంచి వెళ్లే ఈ రైలు వల్ల ఆ సమస్య తీరిపోతోంది. టూరిస్టులు, భక్తులు, ప్రయాణికులు.. అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ రైలు మొదటిది కాదు.. కానీ ప్రత్యేకం ఎందుకంటే ఇది మనం కోరుకున్న కలను నిజం చేస్తోంది. తిరుపతి గుడి పక్కనుండే స్టేషన్ లో ఎక్కి, వారం రోజులు గడిపి, చిక్‌మంగళూరులో కాఫీ వాసనలతో రిఫ్రెష్ అవ్వడం.. ఇప్పుడు ఎటువంటి కష్టాలు లేకుండా సాధ్యమే.

అంతే కాదు.. ఈ రైలులో ప్రయాణించడం ఓ పర్యాటక అనుభవం మాత్రమే కాదు.. ఒక విలువైన జ్ఞాపకం. చిన్న పిల్లలు, వృద్ధులు, కుటుంబ పర్యటనలు, జంటల ట్రిప్స్.. అందరికీ సరిపోయే రైలు ఇది. ఈ ప్రయాణాన్ని మిస్ కాకండి.. తిరుపతి – చిక్‌మంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను మీ టూరిజం ప్లాన్‌లో తప్పకుండా చేర్చుకోండి. ఒకవైపు భక్తి, మరోవైపు ప్రకృతి.. రెండింటినీ అనుభవించాలంటే ఇదే సరైన సమయం!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×